HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >19 Peoples Phones Were Switched Off In The Kurnool Bus Accident What Happened To Them

Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

  • Author : Vamsi Chowdary Korata Date : 24-10-2025 - 12:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kurnool Road Accident
Kurnool Road Accident

కర్నూలు బస్సు ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు.. ప్రమాదంలో దగ్ధమైన బస్సులోంచి 19 మృతదేహాలను బయటకు తీశాయి. అయితే ఈ ప్రమాదంలో 30 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. మిగతా వారి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

వారి ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో సూరారంలో ఇద్దరు, జేఎన్‌టీయూ వద్ద ముగ్గురు ప్రయాణికులు ఎక్కినట్లు తెలుస్తోంది. ఇందులో సూరారం వద్ద ఎక్కిన గుణసాయి కిటికీలోంచి దూకి ప్రాణాలు రక్షించుకోగా.. మరో వ్యక్తి ప్రశాంత్‌ ఫోన్‌ సిచ్చాఫ్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జేఎన్‌టీయూ వద్ద ఎక్కిన ముగ్గురిలో.. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నట్లు సమాచారం. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

చనిపోయిన వారు వీరే..

  • ఎం.సత్యనారాయణ – సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
  • జయసూర్య – మియాపూర్‌, హైదరాబాద్‌
  • నవీన్‌ కుమార్‌ – హయత్‌నగర్‌, హైదరాబాద్‌
  • సరస్వతీ, నిహారిక – బెంగళూరు
  • నీలకుర్తి రమేశ్‌, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తె జస్విత, కుమారుడు అభిరామ్‌ – కొత్తపేట, నెల్లూరు జిల్లా
  • కాపరి అశోక్‌, కాపరి శ్రీహర్ష – నెల్లూరు

వీరితో పాటు చనిపోయిన మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఉన్న ట్రావెల్స్ కార్యాలయం నుంచి గురువారం రాత్రి 9 గంటలకు బెంగళూరుకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే బస్సులో మంటలు చెలరేగాయి.

ఓ బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బస్సు కిందకు బైక్ దుసుకెళ్లడంతో.. పెట్రోల్ లీక్ అయ్యి మంటలు రాజుకున్నట్లు.. తర్వాత బస్సు మొత్తం వ్యాపించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

బస్సు ప్రమాదానికి గురైన సమయంలో.. స్థానికులు వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరగ్గానే అటుగా వెళ్తున్న ఓ మహిళ.. వీడియో తీసి, పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. వీడియో పోలీసులకు షేర్ చేయడంతో.. వారు ప్రమాద తీవ్రతను గుర్తించి.. వెంటనే అన్ని విభాగాలనూ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే అదే మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి.. గాయపడిన ఓ వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • bus fire accident
  • kurnool
  • Kurnool Bus Accident
  • Kurnool Bus Fire

Related News

Electricity demand in Andhra Pradesh to double in ten years: Experts warn against grid expansion

పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ రెట్టింపు: గ్రిడ్ విస్తరణపై నిపుణుల హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్ తన ఇంధన రంగంలో ఒక పెను మార్పుకు సిద్ధమవుతోంది. కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) విడుదల చేసిన వనరుల లభ్యత ప్రణాళిక (2024-25 నుండి 2034-35) ప్రకారం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2024-25లో 14,610 మెగావాట్ల నుండి 2034-35 నాటికి భారీగా 28,850 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

  • PURE EV launches new showroom in Kadapa

    కడపలోకి PURE EV సరికొత్త షోరూమ్‌ ప్రారంభం

Latest News

  • పరిటాల రవీంద్ర వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి

  • పేరు కే కూలి ఇంట్లో బయటపడ్డ భారీ సంపద..!

  • మీరు ఇలా చేస్తారా? అంటూ సమంత ఓపెన్ ఛాలెంజ్

  • అమెరికా లో మంచు తుఫాను బీభత్సం

  • బాక్సాఫీస్ కలెక్షన్స్ తో మళ్లీ ఊపందుకున్న మన శంకర వరప్రసాద్ గారు…

Trending News

    • మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

    • 8వ వేత‌న సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?

    • గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ

    • సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ

    • జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్‌పై బయటకొచ్చిన ఖైదీలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd