HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >1 45 Cr Households Participate In Jagananne Maa Bhavishyathu Survey

Jagananne Maa Bhavishyathu: 1.45 కోట్ల కుటుంబాల మద్దతుతో వైసీపీ ప్రభంజనం

ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది.

  • By Praveen Aluthuru Published Date - 02:09 PM, Sun - 30 April 23
  • daily-hunt
Jagan Highlights
Andhra Pradesh Chief Minister Y. S. Jagan Mohan Reddy

Jagananne Maa Bhavishyathu: ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఇక వైసీపీ పార్టీ ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.కాగా ఈ కార్యక్రమం 1.45 కోట్ల ప్రజలకు చేరువ అయింది. ఈ కార్యక్రమం ద్వారా అధికార పార్టీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా ఏపీలో 80 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నట్టు అధికార పార్టీ భావిస్తుంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా జగనన్నే మా భవిష్యత్తుగా నిలిచిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ సర్వే ఫలితం ద్వారా వైయ‌స్ఆర్‌సీపీ క్యాడర్ మరింత ఉత్సాహంతో పని చేస్తుందని అంటున్నారు.

నిన్న శనివారంతో ఈ మెగా పీపుల్స్ సర్వే ముగిసింది. ఇంతటి మహా సర్వేలో ప్రజలు వైసీపీకి మద్దతుగా ఉన్నట్టు తేలింది. కోటికి పైగానే ప్రజలు మిస్డ్ కాల్ ద్వారా సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. ఈ సర్వే పూర్తవ్వడంతో వైసీపీ నేతలు కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలను పంచుకున్నారు. రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు ఏసీసీ దేవినేని అవినాష్‌తో సహా సీనియర్‌ నేతలు 7 లక్షల మంది పార్టీ క్యాడర్‌ మిషన్‌ మోడ్‌లో సాధించిన అద్భుతమైన మైలురాయిని వివరించారు.

మెగా పీపుల్స్ సర్వే ఫలితాలను హైలైట్ చేస్తూ, రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామి రెడ్డి మాట్లాడుతూ, “భారత రాజకీయాలు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి రాజకీయ సర్వేని చూడలేదు. ఈ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉండడంతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఇంత తక్కువ సమయంలో, 1.45 కోట్ల కుటుంబాలు డ్రైవ్‌లో పాల్గొన్నాయి మరియు మాకు 1.10 కోట్లకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఈ సర్వే తెలియజేస్తోందన్నారు.కాగా పార్టీ క్యాడర్ మొత్తానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ కిందిస్థాయి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటి స్థాయిలో ప్రజా సర్వేను తానెప్పుడూ చూడలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు వైఎస్సార్సీపీ అట్టడుగు స్థాయి కార్యకర్తలందరికీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ స్థాయిలో ప్రజాసాధికార సర్వే చూడలేదు. ఈ డ్రైవ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తాము సాధించినందుకు గర్వపడాలి అని ఆళ్ల అయోధ్య రామి రెడ్డి అన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ “ఈ మైలురాయిని ఒక్కరోజులో సాధించలేదు. పార్టీ 7 లక్షల మంది అట్టడుగు స్థాయి కార్యకర్తలకు ఆరు నెలలకు పైగా శిక్షణనిచ్చింది. గృహాలు, సచివాలయాలు, మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు జిల్లాలు ఇలా ప్రతి స్థాయిలో క్యాడర్‌ను చాలా జాగ్రత్తగా సమన్వయం చేసింది . ఈ వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా ప్రజల్లో తమ బలమెంతో తెలిసిందని అన్నారు. ఇక ఇదే ఫలితాలపై విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 1.45 కోట్ల కుటుంబాలకు అండగా నిలవడం, నేడు జగన్‌ ప్రభుత్వం చేస్తున్న పని పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌పై నమ్మకం ఉంచారని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని అన్నారు.

సర్వే ఫలితాలపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మెగా పీపుల్స్ సర్వేలో అత్యధికంగా ఇంటింటా భాగస్వామ్యాన్ని సాధించిన జిల్లాలు కాకినాడ, ఎన్టీఆర్, బాపట్ల, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ మెగా సర్వే ఫలితం సిఎం జగన్ విశ్వసనీయతకు నిదర్శనం అని అన్నారు.

Read More: Telangana Secretariat: బ్రేకింగ్.. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Political News
  • cm jagan
  • Jagananne Maa Bhavishyathu:
  • YCP Mega Survey Results
  • ysrcp
  • YSRCP Survey

Related News

Elections

Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

మంత్రి పొంగూరు నారాయణ ఇటీవ‌ల మాట్లాడుతూ.. రాష్ట్రంలో పట్టణ స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్నికల కమిషన్‌తో చర్చించి త్వరలో షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు.

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd