Rishi Sunak- PM Modi: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో ఫోన్ లో మాట్లాడిన మోదీ..!
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak- PM Modi)తో టెలిఫోన్లో మాట్లాడారు.
- By Gopichand Published Date - 08:34 AM, Sat - 4 November 23
Rishi Sunak- PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak- PM Modi)తో టెలిఫోన్లో మాట్లాడారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కోసం జరుగుతున్న చర్చల పురోగతిపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ ఒప్పందం ఇరు దేశాలకు మేలు చేస్తుందని ఇరువురు నేతలు అంగీకరించారు. పశ్చిమాసియాలోని ఆందోళనకర పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు మరియు ఇజ్రాయెల్పై హమాస్ దాడులను ఖండించారు.
ఈ విషయాన్ని పీఎంవో తెలిపింది
ఉగ్రవాదం, క్షీణిస్తున్న భద్రత పరిస్థితి, పౌరుల ప్రాణాలనష్టం పట్ల ఇరువురు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచకప్లో టీమిండియా విజయం సాధించినందుకు ప్రధాని మోదీని కూడా సునాక్ అభినందించారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఇతర రంగాలతో సహా ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారని అధికారులు తెలిపారు. బ్రిటన్ ప్రధానిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సునాక్ను ప్రధాని మోదీ అభినందించారు.
Also Read: Israel Bombs Ambulances : అంబులెన్సులపైకి ఇజ్రాయెల్ బాంబులు.. 15 మంది మృతి, 60 మందికి గాయాలు
బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో తాను మాట్లాడినట్లు ఎక్స్లో ప్రధాని మోదీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చించామని, పశ్చిమాసియాలోని పరిస్థితులపై మాట్లాడామని తెలిపారు. ఉగ్రవాదం, హింసకు తావు లేదని మేము అంగీకరిస్తున్నాము. పౌరుల మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాంతీయ శాంతి, భద్రత, సుస్థిరత, నిరంతర మానవతా సహాయం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
Related News
Sundar Pichai: 20 ఏళ్లుగా ఒకే కంపెనీలో.. సుందర్ పిచాయ్పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..!
ప్రపంచంలోనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) 20 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు.