Boris Johnson: బ్రేకింగ్.. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా
పార్టీగేట్ కుంభకోణంపై పార్లమెంటరీ కమిటీ విచారణ నివేదిక తర్వాత బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు.
- By Gopichand Published Date - 09:46 AM, Sat - 10 June 23
Boris Johnson: పార్టీగేట్ కుంభకోణంపై పార్లమెంటరీ కమిటీ విచారణ నివేదిక తర్వాత బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రధానమంత్రి పదవిలో ఉంటూ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పార్లమెంటరీ పార్టీని తప్పుదోవ పట్టించినందుకు పార్లమెంటరీ కమిటీ విచారణలో ఆయనపై నిషేధం విధించాలని సిఫారసు చేసింది.
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కోవిడ్ మహమ్మారి సమయంలో డౌనింగ్ స్ట్రీట్లో పార్టీ చేసుకోవడం గురించి 58 ఏళ్ల జాన్సన్ హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటీష్ పార్లమెంట్)ని తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరుపుతోంది. ప్రివిలేజెస్ కమిటీ నుంచి ఈ అంశంపై రహస్య లేఖ అందడంతో జాన్సన్ శుక్రవారం తన రాజీనామాను ప్రకటించారు. పార్లమెంటరీ కమిటీ తనను పార్లమెంట్ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తోందని జాన్సన్ ఆరోపించారు. నేను ఉద్దేశపూర్వకంగానో, నిర్లక్ష్యంగానో పార్లమెంట్ను తప్పుదోవ పట్టించాననడానికి కమిటీ ఇంతవరకు ఒక్క సాక్ష్యాన్ని కూడా సమర్పించలేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
అంతకుముందు శుక్రవారం మాజీ పీఎం జాన్సన్ విచారణ నివేదికను స్వీకరించడం గురించి తెలియజేసారు. ఇది లోపాలు, పక్షపాతంతో నిండి ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో ప్రివిలేజెస్ కమిటీకి ఇచ్చిన ప్రకటనలో జాన్సన్ పార్లమెంటును తప్పుదారి పట్టించారని అంగీకరించారు. అయితే, ఉద్దేశపూర్వకంగా అలా చేయడాన్ని ఆయన ఖండించారు.
Also Read: 3D Printed Temple: ప్రపంచంలోనే తొలి త్రీడీ టెంపుల్.. మన తెలంగాణలోనే..!
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం సరికాదు
కోవిడ్ లాక్డౌన్ సమయంలో డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన పార్టీలలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే చర్చ సరైనది కాదని ఆయన అన్నారు. అవి అవసరమైన కార్యక్రమాలని, అందుకే అనుమతించామని చెప్పారు. పార్టీ సమయంలో అన్ని మార్గదర్శకాలను అనుసరించినట్లు ఆయన తెలిపారు.
తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జాన్సన్ సుదీర్ఘమైన ప్రకటనను విడుదల చేశారు. అందులో “నేను అబద్ధం చెప్పలేదు. కమిటీకి తెలుసునని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.” నేను కామన్స్లో మాట్లాడినప్పుడు నేను నిజమని నమ్మినదే చెబుతున్నానని తనకు బాగా తెలుసునని అన్నారు.
పార్లమెంటరీ కమిటీపై ఆరోపణలు
ప్రస్తుత ప్రధాని, డౌనింగ్ స్ట్రీట్లో నివసిస్తున్న రిషి సునక్ కూడా తాము చట్టబద్ధంగా కలిసి పనిచేస్తున్నామని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. జాన్సన్ కమిటీ ‘కంగారూ కోర్టు’ తరహాలో పనిచేస్తోందని ఖండించారు. వాస్తవాలతో సంబంధం లేకుండా తనను దోషిగా నిర్ధారించడమే కమిటీ మొదటి నుండి లక్ష్యం అని పేర్కొన్నారు. పార్టీగేట్ కుంభకోణం కారణంగా బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
Related News
Instagram Down: మరోసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్లో ఫిర్యాదులు..!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ (Instagram Down) అయినట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది.