HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Tension Mounts Between Pak And Iran Again After Unidentified Gunmen Kill 9 Pakistanis In Saravan

Iran Vs Pakistan: ఇరాన్ వర్సెస్ పాకిస్తాన్.. 9 మంది పాకిస్తానీయుల కాల్చివేత

Iran Vs Pakistan:  ఇరాన్- పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది.

  • By Pasha Published Date - 08:03 AM, Sun - 28 January 24
  • daily-hunt
Iran Vs Pakistan
Iran Vs Pakistan

Iran Vs Pakistan:  ఇరాన్- పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఈ రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడుల వ్యవహారం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. చివరకు సరిహద్దు ప్రాంతంలో నివసించే  సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకునే స్థాయికి ఈ వ్యవహారం చేరుకుంది. తాజాగా ఇరాన్‌లోని(Iran Vs Pakistan) సరావన్ టౌన్‌లో నివసిస్తున్న 9 మంది పాకిస్తానీయులను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. వారంతా రోజువారీ కార్మికులు అని తెలుస్తోంది . జీవనోపాధి కోసం వీరంతా పాక్ నుంచి ఇరాన్‌కు వలస వెళ్లారని సమాచారం.  స్థానికంగా ఉండే ఓ కార్ మెకానిక్ షెడ్‌లో ఈ 9 మంది పని చేస్తుండేవారు. సరావన్‌కు చెందిన ఇరాన్ దేశస్తుడు ఒకరు వారిపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు.

మృతుల కుటుంబాలకు పాక్ సంతాపం

ఇరాన్ చోటుచేసుకున్న ఈ  దారుణ వ్యవహారాన్ని ఇరాన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది. తమ దేశ పౌరుల మరణాల పట్ల  దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని పాకిస్తాన్ రాయబారి మహ్మద్ ముదస్సిర్ టిపు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అన్ని విధాలుగా సహకరిస్తామని ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరణించిన తొమ్మిది మంది మృతదేహాలను  స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

కొద్దిరోజుల కిందటే పాకిస్తాన్‌, ఇరాన్‌లు ఉగ్రవాదల శిబిరాల పేరుతో ఒకదేశంపై మరోదేశం దాడి, ప్రతిదాడి చేసుకున్నాయి.   బలూచిస్తాన్ ప్రాంతంలోని సిస్టాన్‌‌, పంజ్గూర్‌పై ఇరాన్ దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్- ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే ఈ ప్రాంతం జైష్ అల్ అద్ల్ అనే ఉగ్రవాద సంస్థకు కేంద్రమని ఇరాన్ ఆరోపిస్తోంది. జైష్ అల్ అద్ల్ ఉగ్ర వాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఆనాడు వైమానిక దాడులు చేపట్టింది. డ్రోన్లతో దాడులు చేసింది. మిస్సైళ్లను వేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌పై పాక్ ప్రతిదాడులు చేసింది.

Also Read :Telangana Express: హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య తెలంగాణ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పు

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కొంతకాలంగా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.  ఎర్రసముదంలో ఈ దాడుల్ని నిలువరించాలని ఇరాన్‌ను చైనా హెచ్చరించింది. ‘చైనా ప్రయోజనాలకు ఏవిధంగానైనా హాని కలిగితే.. ఆ ప్రభావం టెహ్రాన్‌తో ఉన్న వ్యాపార సంబంధాలపై పడుతుంది. అందుకే సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండి’ అని డ్రాగన్ చెప్పినట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న వేళ.. నౌకలపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 9 Pakistanis Killed
  • Iran
  • Iran Vs Pakistan
  • pakistan

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • A massive earthquake shook Afghanistan, killing more than 250 people

    Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

Latest News

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd