Former Aussie Prime Minister: భారత్, ఆస్ట్రేలియా సంబంధాలపై ఆసీస్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలపై ఆస్ట్రేలియా మాజీ ప్రధాని (Former Aussie Prime Minister) టోనీ అబాట్ మాట్లాడారు.
- By Gopichand Published Date - 09:15 PM, Fri - 23 February 24
Former Aussie Prime Minister: భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలపై ఆస్ట్రేలియా మాజీ ప్రధాని (Former Aussie Prime Minister) టోనీ అబాట్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన హిందూ దేవాలయాల ధ్వంసంపై కూడా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బలమైన సంబంధం ఉందని అన్నారు. కాలంతో పాటు ఈ బంధం మరింత బలపడుతోందన్నారు.
మాజీ ప్రధాని మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో కొన్ని ఆలయాలను మైనార్టీలు టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. టోనీ అబాట్ కూడా భారతీయ, ఆస్ట్రేలియన్ కమ్యూనిటీల మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవని ఒప్పుకున్నాడు. అయితే ఇటీవలి కాలంలో విభేదాలు ఉన్నాయన్నారు. టోనీ అబాట్ ఇలా అన్నాడు. నేను ఎప్పటినుంచో చెప్పినట్ల భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య అగ్రరాజ్యమని చెప్పుకొచ్చారు.
Also Read: TDP-Janasena First List : రేపు 90 మంది అభ్యర్థులతో టీడీపీ ఫస్ట్ లిస్ట్..?
గతేడాది చాలా ఆలయాలు ధ్వంసమయ్యాయి
గత సంవత్సరం.. ఆస్ట్రేలియాలో కొంతమంది వ్యక్తులు అనేక హిందూ దేవాలయాలను నిరంతరం లక్ష్యంగా చేసుకున్నారు. 2023 జనవరి మొదటి 15 రోజుల్లోనే 3 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. మీడియా కథనాల ప్రకారం.. ఖలిస్థాన్ అనుకూల వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు.
ఆస్ట్రేలియాలో ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి?
భారతదేశానికి చెందిన లక్షలాది మంది ఉపాధి కోసం ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. కొంతమంది అక్కడి పౌరసత్వం కూడా తీసుకున్నారు. 2024 నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియాలో దాదాపు 134 హిందూ దేవాలయాలు ఉన్నాయి.
We’re now on WhatsApp : Click to Join
ఆస్ట్రేలియాలో హిందూ మతం మూడవ అతిపెద్ద మతం
2021 జనాభా లెక్కల ప్రకారం.. ఆస్ట్రేలియాలో 2.7% హిందువుల జనాభా ఉంది. ఇక్కడ ఏదైనా మతం వేగంగా అభివృద్ధి చెందిందంటే అది హిందూ మతమేనని నివేదికలో పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో మూడవ అతిపెద్ద మతం హిందూ. ఇక్కడ దాదాపు 684,002 మంది హిందువులు నివసిస్తున్నారు.
Tags
Related News
Mall : మాల్లో కత్తిపోట్ల కలకలం.. నలుగురి మృతి!
Sydney mall: ఆస్ట్రేలియా(Australia) రాజధాని సిడ్నీ(Sydney)లోని ఓ షాపింగ్ మాల్(Shopping mall)లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు, పలువురు గాయపడ్డట్టు సమాచారం. సిడ్నీలోని బోండీ జంక్షన్ పరిధిలో గల వెస్ట్ఫీల్డ్ మాల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు బీఎన్ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. BREAKING: Multiple people injured in stabbing at Westfield Bo