HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >It Would Have Been Better If I Had Died Too Masood Azhar After Family Members Killed In Operation Sindoor

Masood Azhar : ‘ఆపరేషన్ సిందూర్‌’‌తో మసూద్ అజార్ రక్త కన్నీరు.. ‘‘నేనూ చనిపోతే బాగుండేది’’

తాను గతంలో ఉగ్రదాడులు జరిపించి అమాయక భారతీయుల ప్రాణాలు తీయించిన విషయాన్ని మర్చిపోయి మసూద్ అజార్(Masood Azhar) నీతులు వల్లించాడు.

  • By Pasha Published Date - 03:10 PM, Wed - 7 May 25
  • daily-hunt
Masood Azhars Family And Relatives Killed Operation Sindoor India Attack Pakistan

Masood Azhar : మసూద్ అజార్ కరుడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది.  జైషే మహ్మద్ పేరుతో ఒక ఉగ్రవాద సంస్థను నడుపుతున్నాడు.  ఇతగాడు భారత్‌లో ఎన్నో ఉగ్రదాడులు చేయించి ఎంతోమంది భారతీయుల ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఉగ్రవాదికి భారత్ తన సత్తా ఏంటో చూపించింది. మసూద్ అజార్ రక్త కన్నీరుతో ఏడ్చే పరిస్థితిని భారత సైన్యం క్రియేట్ చేసింది.  బుధవారం తెల్లవారుజామున 1 గంటలకు భారత ఆర్మీ నిర్వహించి ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్‌కు భారీ నష్టం కలిగింది. భారత ఆర్మీ అతడికి మానసికంగా కోలుకోలేనంత దెబ్బ కొట్టింది.  భారత ఆర్మీ క్షిపణి దాడుల్లో 14 మంది మసూద్ అజార్‌ కుటుంబ సభ్యులు హతమయ్యారు. చనిపోయిన మసూద్ అజార్ కుటుంబీకుల్లో  ఐదుగురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహావల్‌పూర్‌లో జామియా మస్జిద్ సుబహానల్లా ఉంది. దీన్ని మసూద్ అజార్ కుటుంబం ఉగ్రవాద స్థావరంగా వాడుకుంటోంది. ఈ మసీదులోనే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తోంది. అందుకే దీనిపై భారత ఆర్మీ ఎటాక్ చేసింది. ఈ దాడిలోనే 14 మంది మసూద్ అజార్ కుటుంబీకులు చనిపోయారు. ఈవివరాలను ధ్రువీకరిస్తూ స్వయంగా మసూద్ అజార్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ వివరాలు చూద్దాం..

Also Read :Pakistan Airspace : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దెబ్బకు పాక్‌ ఎయిర్‌స్పేస్‌ ఖాళీ

మసూద్ అజార్ ప్రకటన ఇదీ.. 

‘‘నా కుటుంబంలోని 14 మంది సభ్యులు ఈ రాత్రి అమరులయ్యే అదృష్టాన్ని పొందారు. ఐదుగురు అమాయక పిల్లలు చనిపోయి, జన్నతుల్ ఫిర్దౌస్‌లో పువ్వులుగా మారారు. నా అక్క సాహిబా నా ప్రాణం కంటే ప్రియమైంది. నా అక్క భర్త, నా మేనల్లుడు అలీమ్ ఫాజిల్, అతడి భార్య, నా ప్రియమైన మేనకోడలు ఆలం ఫాజిలా, మా మేనల్లుడు, అతడి భార్య అల్లాహ్‌కు ప్రియమైనవారు అయ్యారు’’ అని మసూద్ అజార్ పేర్కొన్నాడు. తాను గతంలో ఉగ్రదాడులు జరిపించి అమాయక భారతీయుల ప్రాణాలు తీయించిన విషయాన్ని మర్చిపోయి మసూద్ అజార్(Masood Azhar) నీతులు వల్లించాడు.

స్వర్గస్తులు అయ్యారంటూ నీతులు.. 

‘‘అమాయక పిల్లలు, బురఖా ధరించిన మహిళలు, వయసు మీద పడిన ముసలి వారిని మోడీ టార్గెట్ చేశారు. ఈ బాధ గురించి నేను మాటల్లో చెప్పలేను. భరించలేనంత బాధను ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అయినా పశ్చాత్తాపం లేదు. బాధ లేదు. భయం లేదు. చనిపోయిన నా 14 మంది కుటుంబీకుల్లో నేను కూడా ఉండి ఉంటే బాగుండేదని నా మైండ్‌లో పదేపదే వస్తోంది. అయితే అల్లాతో మనం కలిసే టైం ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. అది ముందు రాదు, వెనుక రాదు. మా ఇంట్లో మొత్తం నలుగురు పిల్లలు ఉండేవారు. వాళ్లంతా మూడేళ్ల నుంచి ఏడేళ్లలోపువారు. వాళ్లంతా కలిసి స్వర్గస్తులయ్యారు. అల్లా ప్రేమించే వారికే అమరత్వం లభిస్తుందని ఖురాన్ చెబుతోంది. వాళ్ల సమయం వచ్చింది కాబట్టే వాళ్లు వెళ్లిపోయారు. మోడీ క్రూరత్వం అన్ని రకాలుగా హద్దులు దాటింది. ఆయన ఎవరినీ వదిలిపెట్టడం లేదు’’ అని మసూద్ అజార్ వ్యాఖ్యలు చేశాడు.

Also Read :Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’‌.. సౌత్ సినీ స్టార్స్ స్పందన ఇదీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • India Attack
  • Masood Azhar
  • Masood Azhars Family
  • Masood Azhars Relatives Killed
  • Operation Sindoor
  • pakistan

Related News

Afghanistan-Pakistan War

Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

పాకిస్తాన్ వైమానిక దాడిలో మొత్తం 8 మంది మరణించారు. ఇందులో ఐదుగురు సాధారణ పౌరులు ఉన్నారు. అంతేకాకుండా 7 మంది ఇతర వ్యక్తులు కూడా గాయపడ్డారు.

  • Ex Soldier India

    Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd