Bus fire Accident : ఘోర బస్సు ప్రమాదం….21మంది సజీవదహనం..మృతుల్లో 12 మంది చిన్నారులు..!!
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. ఓ బస్సులో మంటలు అంటుకుని...21 మంది సజీవ దహనమయ్యారు
- By hashtagu Published Date - 08:21 AM, Thu - 13 October 22
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. ఓ బస్సులో మంటలు అంటుకుని…21 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. సింధ్ ప్రావిన్స్ లోని జంషోరో జిల్లా నూరియాబాద్ సమీపంలో అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఏసీ బస్సులో షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా వరద బాధితులు. కరాచీ నుంచి తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా…బస్సు ప్రమాదానికి గురయ్యింది.
అధికారుల వివరాల ప్రకారం…ఆగస్టులో పాకిస్తాన్ లో వరదలు భీకరంగా వచ్చాయి. దీంతో వరద బాధితులను కరాచీలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగవ్వడంతో…వారంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకునేందుకు బస్సులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సింధ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన 45మంది ఏసీ బస్సులో తమ గ్రామాలకు బయలుదేరారు. బస్సు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు కాలి బూడిదయ్యింది. అందులో ఉన్నవారు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. కిటికీలు మూసి ఉండటంతో బయటకు రాలేకపోయారు. మంటలుకొందరు కాలిపోగా…దట్టమైన పొగతో ఊపిరాడక మరికొంతమంది ప్రాణాలు వదిలారు. మరణించినవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Reports coming in of a bus having caught fire near Nooriabad on the M9 Motorway – prayers for the safety and well being of all on board.#Sindh#Pakistan pic.twitter.com/8CmHjL1amw
— Yusra Askari (@YusraSAskari) October 12, 2022
#Pakistan At least 18 passengers were killed, several others injured after a passenger bus caught fire on the M9 motorway near Jamshoro’s Nooriabad Town.According to the police, the ill-fated bus, with flood affectees on board,was heading towards Khairpur Nathan Shah from Karachi pic.twitter.com/XSap70K5b3
— Surendhar (@Surendhar_Twitz) October 13, 2022
BREAKING: At least 16 people including minors burnt alive after a bus carrying Pakistan flood victims from Karachi caught fire at super highway near Nooriabad: officials pic.twitter.com/0Y152aG4os
— Insider Paper (@TheInsiderPaper) October 12, 2022
Related News
Pakistan : పాక్కు షాక్.. మూడు చైనా కంపెనీలపై అమెరికా కొరడా
Pakistan: పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి(Ballistic missile) కార్యక్రమాలకు సంబంధించిన వస్తువులను సరఫరా చేస్తున్న మూడు చైనాChina)కంపెనీలపై మరియు బెలారస్కి చెందిన ఒక కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈమేరకు విదేశాంగ శాఖ ప్రకటించింది. కంపెనీల పేర్లు చైనా నుండి జియాన్ లాంగ్డే టెక్నాలజీ డెవలప్మెంట్, టియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ గ్రాన్పెక్ట్ కో. లిమిటెడ్ మరియు బె