Elon Musk Shock: ఉద్యోగులకు నో ఫ్రీ ఫుడ్… నో ఫ్రీ వైఫై…!!
ట్విట్టర్ పరిస్థితి ప్రస్తుతం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. అందులో పనిచేసే ఉద్యోగులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- By hashtagu Published Date - 09:55 AM, Sat - 12 November 22
ట్విట్టర్ పరిస్థితి ప్రస్తుతం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. అందులో పనిచేసే ఉద్యోగులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించారు మస్క్. చివరకు బోర్డు డైరెక్టర్లనూ వదలలేదు. ఇప్పుడు మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. రిమోట్ వర్క్ ను అంగీకరించడంలేదు. ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే…ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందేనని హుకూం జారీ చేశాడు. ఈ మేరకు ఉద్యోగులందరికీ ఈమెయిల్స్ ద్వారా సందేశాలు పంపించాడు. నిన్నటి వరకు 40గంటల పనిచేయాల్సిందేనని చెప్పిన మస్క్…ఇప్పుడు మాట మార్చాడు. 80గంటల వారాలు విధిస్తున్నట్ల ప్రకటించాడు.
అంతేకాదు ట్విట్టర్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఫ్రీ ఫుడ్, సెక్యూరిటీ సెలవులు, వైఫై కల్పించేవారు. కానీ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక…వాటిన్నింటికి స్వప్తి చెప్పాడు. ఇప్పటికే పాలన గాడి తప్పింది. దీనికి తోడు సీఈఓలు లేరు. 7500మంది ఉద్యోగులకు 3978మందిని తీసేసాడు. కొత్త బాస్ నిర్ణయం వల్ల ట్విట్టర్ దాదాపు 13బిలియన్లు అప్పు అదనంగా చేయాల్సిన దుస్తుతి నెలకొంది. అంతేకాదు ఇద్దరు కీలకమైన వ్యక్తులు ట్విట్టర్ నుంచి తప్పుకున్నారు.
Related News
Elon Musk Net Worth Rise: మస్క్తో మామూలుగా ఉండదు మరీ.. 5 రోజుల్లో రూ. 3 లక్షల కోట్లు సంపద..!
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నికర విలువ సోమవారం నాడు 18.5 బిలియన్ డాలర్లు పెరిగింది.