Congo: కాంగోలో ఉగ్రదాడి.. 22 మంది మృతి
ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో మరోసారి ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ఉగ్రవాదులు 22 మందిని చంపడమే కాకుండా ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేసి వారితో తీసుకెళ్లారు. రెండు వేర్వేరు దాడుల్లో ఉగ్రవాదులు ఈ దారుణ హత్యలకు పాల్పడ్డారు.
- By Gopichand Published Date - 06:46 AM, Mon - 20 March 23
ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో మరోసారి ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ఉగ్రవాదులు 22 మందిని చంపడమే కాకుండా ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేసి వారితో తీసుకెళ్లారు. రెండు వేర్వేరు దాడుల్లో ఉగ్రవాదులు ఈ దారుణ హత్యలకు పాల్పడ్డారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం కాంగోలో శాంతిని నెలకొల్పడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే దీని తర్వాత కూడా అవకాశం చూసి ఉగ్రవాదులు ఏదో ఒక ఘటనకు పాల్పడుతున్నారు.
సమాచారం ప్రకారం.. తిరుగుబాటుదారులు కాంగోలోని తూర్పు ఇటూరి, ఉత్తర కివు ప్రావిన్సులలో వరుస దాడులను జరిపారు. శనివారం ఇటూరి ప్రావిన్స్లోని పలు గ్రామాలపై ఉగ్రవాదులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడిలో 12 మందిని చంపారు ఉగ్రవాదులు. స్థానికులు, అధికారులు ఈ దాడికి కోడెకో గ్రూప్ కారణమని ఆరోపించారు. ఈ గుంపు మిలిటెంట్ల సంస్థ వారు అడవుల్లో నివసిస్తారు. అవకాశం దొరికిన వెంటనే గ్రామస్థులపై దాక్కుని దాడి చేస్తారు.
Also Read: Leopard: భారత్ సరిహద్దుల్లో చిరుతపులి… హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు!
ఈ సంస్థ కాంగోలోని బలహీన వర్గాల ప్రజలను ఊచకోత కోస్తుంది. నార్త్ కివు ప్రావిన్స్లోని లుబెరో రీజియన్ అడ్మినిస్ట్రేటర్ కల్నల్ అలెన్ కివెవా మాట్లాడుతూ.. మౌంట్ క్యావిరిములోని న్గులి గ్రామంలో ఉగ్రవాదులు 10 మందిని హతమార్చారు. ఇక్కడి నుంచి ఉగ్రవాదులు ముగ్గురిని కిడ్నాప్ చేసి తమతో తీసుకెళ్లారు. తూర్పు కాంగోలో ఉన్న ఉగాండా సాయుధ సమూహం అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF) దాడికి పాల్పడిందని కల్నల్ అలెన్ ఆరోపించారు. ఈ బృందం ఇస్లామిక్ స్టేట్కు విధేయత చూపుతుందని ఆయన చెప్పారు.
కాంగోలోని తిరుగుబాటుదారులు ఇలాంటి దాడులు చేస్తూనే ఉంటారు. మే 2022లో తిరుగుబాటుదారులు UN శాంతి పరిరక్షక దళానికి చెందిన భారతీయ సైనికులపై దాడి చేశారు. ఈ దాడి హఠాత్తుగా జరిగింది. దాడి సమయంలో తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు.
ఈ సమయంలో శాంతి మిషన్ కింద మోనుస్కోలో భారత సైన్యం బృందం కూడా పాల్గొంది. దాడి జరిగిన వెంటనే భారత సైనికులు భీకరంగా పోరాడడమే కాకుండా తిరుగుబాటుదారులను తరిమికొట్టారు. ఈ ప్రతీకార చర్యలో ఈ శాంతి మిషన్లో భాగమైన ఇతర దేశాల సైనికులు భారత సైన్యానికి సహాయం చేశారు.
Related News
Israel Operation: శరణార్థుల శిబిరంపై దాడి.. పిల్లలతో సహా 14 మంది మృతి
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత ఏడు నెలలుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 34 వేల మందికి పైగా మరణించారు.