Khalistani Terrorist: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉంది: కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో
ఇటీవల కెనడాలో ఖలిస్తాన్ (Khalistani Terrorist) టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు. ఈ మరణం జరిగిన నెలరోజుల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) కాల్పుల వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు.
- By Gopichand Published Date - 08:12 AM, Tue - 19 September 23
Khalistani Terrorist: ఇటీవల కెనడాలో ఖలిస్తాన్ (Khalistani Terrorist) టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు. ఈ మరణం జరిగిన నెలరోజుల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) సోమవారం (సెప్టెంబర్ 18) కాల్పుల వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. CBC నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వానికి, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు మధ్య ఉన్న సంబంధాలపై దేశ భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని జస్టిన్ ట్రూడో చెప్పారు.
ఒట్టావాలోని హౌస్ ఆఫ్ కామన్స్లో జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. “భారత ప్రభుత్వ ఏజెంట్లకు, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు మధ్య సాధ్యమైన సంబంధంపై కెనడియన్ భద్రతా సంస్థలు విశ్వసనీయ ఆరోపణలను చురుకుగా కొనసాగిస్తున్నాయి.” అన్నారు. జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ గురుద్వారా వెలుపల కాల్చి చంపబడ్డాడు. గతవారం జరిగిన జీ20 సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు ట్రుడో తెలిపారు. ఈ ఏడాది జూన్ 18న వాంకోవర్లోని సర్రే గురుద్వారా వద్ద భారత్ వాంటెడ్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీ, జస్టిన్ ట్రూడో మధ్య సంభాషణ
జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఈ అంశాన్ని (ఖలిస్తానీ) లేవనెత్తినట్లు జస్టిన్ ట్రూడో తెలిపారు. కెనడా తన ఆందోళనలను భారత ప్రభుత్వ ఉన్నత గూఢచార భద్రతా అధికారులకు తెలియజేసింది. గత వారం జరిగిన జి20లో ప్రధాని మోదీకి నేను వ్యక్తిగతంగా, నేరుగా ఆ విషయాలను చెప్పానని ఆయన అన్నారు. అదే సమయంలో, G20 సమ్మిట్ సందర్భంగా జరిగిన సమావేశంలో కెనడాలో తీవ్రవాద శక్తులు చేస్తున్న భారత వ్యతిరేక కార్యకలాపాలపై జస్టిన్ ట్రూడోకు ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Taiwan Earthquake: తైవాన్లో భారీ భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు
PMO కెనడాకు సమాధానం ఇచ్చింది
వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల సిండికేట్లు, మానవ అక్రమ రవాణాతో ఈ తీవ్రవాద శక్తులకు సంబంధాలు కెనడాకు కూడా ఆందోళన కలిగించే విషయం అని భారత ప్రభుత్వం పేర్కొంది. కెనడాలో వేర్పాటువాదం ప్రచారం జరుగుతోంది. భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపించడంతో దౌత్య సముదాయాలు దెబ్బతింటున్నాయి. కెనడాలో భారతీయ సమాజం, వారి ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు.
నిజ్జర్పై రూ.10 లక్షల రివార్డు
పంజాబ్లోని జలంధర్లోని భర్సింగ్పూర్ గ్రామంలో 2022లో హిందూ పూజారి హత్యకు కుట్ర పన్నాడని నిజ్జర్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. గతంలో భారత్పై ఉగ్రవాద చర్యలకు కుట్రపన్నారనే కేసులో నిజ్జర్పై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది.
Related News
PM Modi: పండ్లు అమ్ముకునే మహిళ చేసిన పనికి మోడీ ఫిదా
కర్ణాటకలో పండ్లు అమ్ముకునే మహిళతో దేశ ప్రధాని ముచ్చటించడం వైరల్ గా మారింది. ప్రధాని మోదీ భేటీ నేడు కర్ణాటకలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పలు ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలతో మామేకం అయ్యారు.