Kohinoor: కోహినూర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్..!
బ్రిటన్ (Britain) యువరాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరుగుతోంది.
- By Maheswara Rao Nadella Published Date - 07:49 PM, Wed - 15 February 23
బ్రిటన్ యువరాజుగా చార్లెస్ – 3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ రాజవంశం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ (Kohinoor) వజ్రాన్ని ధరించకూడదని నిర్ణయించింది. ఈ కిరీటానికి బదులు క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నట్టు సమాచారం . పట్టాభిషేకం సమయంలో రాణి కెమిల్లా కిరీటధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని ధరించాలని తొలుత భావించినా… చివరకు ఆ ఆలోచనను పక్కనపెట్టారు. క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. ఈ కిరీటంలో క్వీన్ ఎలిజబెత్2కి చెందిన నగలను కిరీటంలో పొదగనున్నారు.
ఇక క్వీన్ ఎలిజబెత్ 2 కిరీటంలో కోహినూర్ (Kohinoor) వజ్రం ఉండేది. దాదాపు 7 దశాబ్దాల పాటు ఆమె మరణించే దాకా ఆమె కిరీటంలో వజ్రం ఉంది. కోహినూర్ వజ్రం మన దేశానికి చెందినది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ తో దౌత్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కోహినూర్ ను ధరించకూడదని రాణి కెమిల్లా నిర్ణయించినట్టు సమాచారం.
Also Read: India Become World No. 1 in Cricket: మేమే నెంబర్ 1..
Related News
Telugu Students: స్కాట్లాండ్ లో దారుణం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Telugu Students: యూకేలోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు స్కాట్లాండ్ లోని అందమైన జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22)గా గుర్తించారు. పెర్త్ షైర్ లోని అథోల్ లోని బ్లెయిర్ సమీపంలోని లిన్ ఆఫ్ తుమ్మెల్ వద్ద బుధవారం రాత్రి విహారయాత్రకు వెళ్లిన స్నేహితుల బృందంలోని ఇద్దరు వ్యక్తులు నీటిలో పడి ఇబ్బందులు ఎద�