HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >America And Britains Secret Island Diego Garcia In The Indian Ocean What Inside It

Secret Island : భారత్‌కు చేరువలో అమెరికా – బ్రిటన్ సీక్రెట్ దీవి.. ఎందుకు ?

1965లో బ్రిటన్ దూకుడుగా వ్యవహరించింది. మారిషస్ దేశం నుంచి  చాగోస్(Secret Island) ద్వీపసమూహాన్ని వేరు చేసింది.

  • By Pasha Published Date - 12:12 PM, Sat - 5 April 25
  • daily-hunt
Diego Garcia Secret Island Indian Ocean America Army Britain Army

Secret Island : భారత్ నుంచి 3,183 కి.మీ దూరంలో హిందూ మహాసముద్రంలో డీగో గార్సియా ద్వీపం ఉంది. దీనిపై చట్టపరమైన హక్కులు బ్రిటన్‌కు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ ద్వీపంలో అమెరికా, బ్రిటన్ సైన్యాలు  ఉన్నాయి. ఈ ద్వీపంలోకి ఎవరినీ అనుమతించరు. టూరిస్టులు కూడా అక్కడికి వెళ్లలేరు. మానవ హక్కుల సంఘాలను సైతం డీగో గార్సియాలోకి అడుగుపెట్టనివ్వరు. అంతలా నిరంకుశంగా అమెరికా, బ్రిటన్ సైన్యాలు అక్కడ వ్యవహరిస్తాయి.

Also Read :Gachibowli Lands: తిరుగులేని దానం.. గచ్చిబౌలిలో 10 ఎకరాలు ఇచ్చేసిన యాక్టర్

డీగో గార్సియా చరిత్ర

1965లో బ్రిటన్ దూకుడుగా వ్యవహరించింది. మారిషస్ దేశం నుంచి  చాగోస్(Secret Island) ద్వీపసమూహాన్ని వేరు చేసింది. ఇందులో దాదాపు 60 దీవులు ఉండేవి. వాటిలో ఒకదాని పేరే డీగో గార్సియా. బ్రిటన్ స్థాపించిన చివరి వలస కాలనీ ఇదే. బ్రిటన్, అమెరికాలు డీగో గార్సియాలో వ్యూహాత్మకంగానే సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాయి. ఎందుకంటే ఇది తూర్పు ఆఫ్రికా, ఇండోనేషియాలకు సమానమైన దూరంలో ఉంటుంది.  తమ మిస్సైళ్లు , యుద్ధ విమానాలకు తగిన రేంజులో ఆసియా దేశాలన్నీ ఉండాలనే లక్ష్యాన్ని ఆనాడు బ్రిటన్, అమెరికా నిర్దేశించుకున్నాయి. మొత్తం మీద ఈ సీక్రెట్ దీవి భారత్, చైనా, పాక్ సహా అన్ని ఆసియా దేశాలకు గండం లాంటిది. మూడో ప్రపంచ యుద్ధమే వస్తే.. డీగో గార్సియా కేంద్రంగా ఆసియా దేశాలను అమెరికా లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉంది. డీగో గార్సియాలోని తమ వైమానిక స్థావరాన్ని చూపించి.. ఆసియా దేశాలను అమెరికా, బ్రిటన్ బెదిరించే అవకాశం ఉంది.  ఇప్పుడు ఇరాన్‌పై దాడుల కోసం.. డీగో గార్సియాలోనే అణ్వస్త్ర బాంబర్లను, యుద్ధ విమానాలను, మిస్సైళ్లను అమెరికా మోహరించింది.

Also Read :Ration Cards: ఆ రేషన్‌ కార్డులు రద్దు.. ఈ-కేవైసీపై కొత్త అప్‌డేట్

డీగో గార్సియా ప్రజలంతా ఎలా మాయం అయ్యారు ? 

1966 నాటికి డీగో గార్సియాలో చాగోసియన్ అటవీ తెగకు చెందిన 924 మంది నివసించేవారు. అయితే 1968 నుంచి 1973 మధ్యకాలంలో బ్రిటన్ సైన్యాలు వాళ్లందరినీ బెదిరించి, సమీపంలోని ఇతర ప్రాంతాలకు బలవంతంగా వలస పంపాయి. మాట వినని వారిని ఏం చేశారో ఇప్పటికీ తెలియదు. నాటి నుంచి నేటిదాకా డీగో గార్సియా ద్వీపంలో కేవలం అమెరికా, బ్రిటన్ సైనికులు మాత్రమే ఉంటున్నారు. వాళ్లను కాదని, అక్కడ చీమ కూడా కదల్లేదు. డీగో గార్సియాలోని ఆటవిక తెగ ప్రజలను తరిమేయడం చట్ట వ్యతిరేకమని, అది మానవ హక్కుల ఉల్లంఘన అని 2019లో  అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. బ్రిటన్ సైన్యం చేష్టలను తప్పుపట్టింది.  అయితే అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుతో బ్రిటన్ ప్రభుత్వం విభేదించింది.

పడవలే దిక్కు.. 

డీగో గార్సియాలోకి వెళ్లేందుకు రోడ్డు మార్గం లేదు. అక్కడికి విమానాలు కూడా వెళ్లవు. కేవలం  హిందూ మహాసముద్రం గుండా పడవల్లో వెళ్లాలి. అది కూడా అక్కడి సైన్యాల అనుమతితోనే. పర్మిషన్ లేకుంటే వెళ్లలేం.  జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు,  టూరిస్టులను ఈ ద్వీపంలోకి అనుమతించరు.  ఒకవేళ అక్కడ మీడియా ప్రతినిధులు కానీ, మానవ హక్కుల సంఘాలు కానీ అడుగుపెడితే.. నిజాలు బయటికి వస్తాయి. డీగో గార్సియా ఆటవిక తెగల వలసలతో ముడిపడిన కీలక విషయాలు బయటికి వస్తాయి. అందుకే వారిని రానివ్వరు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • britain
  • Diego Garcia
  • india
  • indian ocean
  • Secret Island

Related News

Rangareddy

Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

Rangareddy: రంగారెడ్డి జిల్లా హైదరాబాదు నగరానికి సమీపంగా ఉండడం వల్ల ఇది ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక హబ్‌గా మారింది. గచ్చిబౌలి, మాధాపూర్, నానకరంరెడ్డి, షమ్షాబాద్, పటాంచెరు పరిసర ప్రాంతాల్లో అనేక అంతర్జాతీయ ఐటీ సంస్థలు, ఫార్మా కంపెనీలు స్థాపించబడ్డాయి

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

  • H1B Visa

    H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

  • India vs Pakistan

    India vs Pakistan: ఆసియా కప్ విజయం తర్వాత మళ్లీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్!

  • Team India Schedule

    Australia Beat India: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర ఓట‌మి!

Latest News

  • Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

  • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

  • CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు

  • Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

  • RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd