Shooting In South Africa: దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
దక్షిణాఫ్రికాలో కాల్పుల (Shooting In South Africa)కలకలం రేగింది. తూర్పు క్వాజులు-నాటల్ ప్రావిన్స్లోని పీటర్మారిట్జ్బర్గ్ (Pietermaritzburg) నగరంలో గల ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది అక్కడికక్కడే మృతి చెందారు.
- By Gopichand Published Date - 08:12 AM, Sat - 22 April 23
దక్షిణాఫ్రికాలో కాల్పుల (Shooting In South Africa)కలకలం రేగింది. తూర్పు క్వాజులు-నాటల్ ప్రావిన్స్లోని పీటర్మారిట్జ్బర్గ్ (Pietermaritzburg) నగరంలో గల ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బాధితులు నిద్రలో ఉన్నట్లు సమాచారం.
దక్షిణాఫ్రికాలోని పీటర్మారిట్జ్బర్గ్ నగరంలో కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ కాల్పుల్లో పది మంది మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన పది మందిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ కాల్పుల ఘటనను గుర్తుతెలియని దుండగులు నిర్వహించారని, వారి కోసం దర్యాప్తు కొనసాగుతోందని అక్కడి పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
ఈ భీకర కాల్పులకు సంబంధించి పీటర్మారిట్జ్బర్గ్ హోమ్స్టేడ్పై గుర్తు తెలియని ముష్కరులు దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని దక్షిణాఫ్రికా పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబంపై వారు మెరుపుదాడి చేశారు. ఈ కాల్పుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు మరణించారు. ఈ ఘటన గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయం చాలా తీవ్రమైనదని పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా టార్గెట్ చేశారు.పోలీసులు పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుటుంబానికి ఎవరితోనైనా పాత శత్రుత్వం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. స్పాట్ను చూసిన తర్వాత, ఈ సంఘటన వృత్తిపరమైన నేరస్థులచే అమలు చేయబడిందని ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ దాడికి సంబంధించిన స్థలంలో ఆ సమయంలో జరిగిన కార్యకలాపాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
దక్షిణాఫ్రికా నుండి ఇలాంటి వార్తలు తరచుగా వస్తున్నాయి. దేశంలో ఇటీవలి కాలంలో సామూహిక కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు జనవరిలో దక్షిణ తీర పట్టణం గెకెబెరాలో పుట్టినరోజు వేడుకలో ఎనిమిది మంది వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. గతేడాది సోవెటోలోని జోహన్నెస్బర్గ్ టౌన్షిప్లో జరిగిన సామూహిక కాల్పుల్లో 16 మంది చనిపోయారు.
Related News
Indian Military: మాల్దీవుల నుంచి వెనక్కి వచ్చేసిన భారత సైనికులు..!
మాల్దీవుల నుంచి భారత్ తన సైనికులందరినీ ఉపసంహరించుకుంది. మాల్దీవుల ప్రభుత్వం శుక్రవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది.