Firing In America: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం.. ఒకరి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల (Firing In America) కలకలం రేగింది. మియామీ బీచ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
- By Gopichand Published Date - 06:49 AM, Sun - 19 March 23

అమెరికాలో మరోసారి కాల్పుల (Firing In America) కలకలం రేగింది. మియామీ బీచ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో రద్దీగా ఉండే మియామీ బీచ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు.
శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు మియామీ బీచ్ పోలీసులు ట్వీట్ చేశారు. కాల్పుల ఘటన అనంతరం ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పట్టుబడిన నిందితుడు షూటర్ కాదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఘటనా స్థలం నుంచి మూడు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన తరువాత, వసంత విరామాన్ని జరుపుకోవడానికి వందలాది మంది ప్రజలు గుమిగూడడంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను పరిమితం చేశారు. బాధితుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు మాత్రం వెల్లడించలేదు.
Also Read: Four Dead: బస్సు బోల్తా.. నలుగురు మృతి, 28 మందికి గాయాలు
తుపాకీ నియంత్రణ చట్టం వచ్చినా అమెరికాలో కాల్పుల ఘటన ఆగడం లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయి. ఎప్పుడు ఎవరిని కాల్చేస్తారో గ్యారెంటీ లేదు. ఈ మధ్య కాలంలో ఈ ఘటనలు మరింత పెరిగాయి. దాదాపు ప్రతి నెలా ఒకటి, రెండు కాల్పుల ఘటనలు ఖచ్చితంగా తెరపైకి వస్తున్నాయి. గత నెలలో అమెరికాలోని మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంటీలో జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఫిబ్రవరిలోనే 12 గంటల్లో 3 కాల్పుల ఘటనలు జరిగాయి. అమెరికాలోని డెస్ మోయిన్స్ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డాడు.

Related News

Nisha Desai Biswal: భారత సంతతి మహిళ నిషా దేశాయ్ బిస్వాల్కు కీలక బాధ్యతలు.. ఎవరీ నిషా దేశాయ్..?
అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కమిషన్ డిప్యూటీ చీఫ్గా నిషా దేశాయ్ బిస్వాల్ (Nisha Desai Biswal)ను ఎంపిక చేస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.