ICE Apples : పెళ్లి రిసెప్షన్లో తాటి ముంజలు ..ఆశ్చర్యంలో అతిధులు
తాటి ముంజలను..ఓ పెళ్లి రిసెప్షన్లో ఏర్పాటు చేసి అతిధులను ఆశ్చర్య పరిచారు
- By Sudheer Published Date - 12:38 PM, Tue - 23 April 24
తాటి ముంజలు (ICE Apples)..వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఇవి ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటిని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి. ఈ మధ్య ఇవి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో ఎక్కువగా లభిస్తున్న..సిటీ లలో మాత్రం చాల రేర్ గా కనిపిస్తున్నాయి. దీంతో అమ్మకం దారులు భారీ ధరకు వీటిని విక్రయిస్తున్నారు. ఎండాకాలంలో వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. అందుకే చాలామంది నగరవాసులు ఇవి ఎక్కడైనా కనిపిస్తే బాగుండు..ఎంత ధర పెట్టైనా తీసుకుంటాం అని మాట్లాడుకుంటుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాంటి ఈ తాటి ముంజలను..ఓ పెళ్లి రిసెప్షన్లో ఏర్పాటు చేసి అతిధులను ఆశ్చర్య పరిచారు. హైదరాబాద్ మన్నెగూడలోని ఒక కన్వెన్షన్ లో జరిగిన పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఇలా అతిధుల కోసం ఏర్పాటు చేసారు. ఇది తెలిసి చాలామంది బంధువులు…వీటికోసం పోటీ పడ్డారు. ఎంతో ఇష్టంగా వాటిని తింటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియో చూసిన ప్రతిఒక్క నెటిజన్ బాగుంది ఐడియా.. వాహ్.. సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఒక రిసెప్షన్ లో అతిథులకి తాటి ముంజలు ఏర్పాటు చేశారు అతిథులు తాటి ముంజలని ఇష్టంగా తిన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే తాటి ముంజలు హైదరాబాద్ ఫంక్షన్ల లో ప్రత్యక్షమవడంతో ఆశ్చర్యంతో ఆరగించారు మన్నెగూడ లోని బిఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్ లో జరిగింది.#Hyderabad #wedding pic.twitter.com/UbTRuGR66c
— Hashtag U (@HashtaguIn) April 23, 2024
Read Also : Allari Naresh : రైటర్ గా మారిన అల్లరి నరేష్
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.