Drunk Teacher: మద్యం మత్తులో ఉపాధ్యాయుడు.. బయటకు లాక్కెళ్లిన పేరెంట్స్
మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడి తీవ్ర ఆందోళనకు గురి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇల్లందులపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
- By Praveen Aluthuru Published Date - 03:17 PM, Fri - 28 June 24
![Drunk Teacher: మద్యం మత్తులో ఉపాధ్యాయుడు.. బయటకు లాక్కెళ్లిన పేరెంట్స్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/1081471-drunkman.png)
Drunk Teacher: తెలంగాణలో ఓ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో రచ్చ చేశాడు. కాల్వ సుధాకర్ అనే ప్రభుత్వ ఉద్యోగి మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న ఘటనతో విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడి తీవ్ర ఆందోళనకు గురి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇల్లందులపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాల్వ సుధాకర్ ప్రవర్తనపై విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఎం చేయాలో తెలియక కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు సదరు పాఠశాలకు వచ్చి సుధాకర్ను తరగతి గదిలో బంధించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యాదమ్మ అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది.
గత కొంతకాలంగా ఆ ఉపాధ్యాయుడి చేస్తున్న కీచక పనులను విద్యార్థులు యాదమ్మకు చెప్పారు. కాగా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని యాదమ్మ విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయుడిని తరగతి గది నుంచి విడుదల చేశారు.
Also Read: Hemant Soren Bail: మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్కు బెయిల్
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Chief Minister Revanth Reddy: నిజామాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కారణమిదే..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/revanth-DSC.jpg)
Chief Minister Revanth Reddy: నిజామాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కారణమిదే..?
Chief Minister Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిజామాబాద్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొని, డీఎస్కు నివాళి అర్పించనున్నారు. ఉదయం బెంగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి డీఎస్ ఇంటికి వెళ్లి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో