Deers Video: పంట పొలాల్లో జింకల సందడి, వీడియో వైరల్
- By Balu J Published Date - 04:13 PM, Sat - 22 July 23
Deers Video: సంగారెడ్డి జిల్లా, మనూరు మండలం మైకోడ్ గ్రామంలో పచ్చని వ్యవసాయ పొలాల గుండా సంచరిస్తున్న మచ్చల జింకలు, కృష్ణజింకల గుంపు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అద్భుతమైన వన్యప్రాణుల దృశ్యం ఎంతోమంది నెటిజన్స్ ను ఆకట్టుకుంది. మంజీర నదికి సమీపంలో ఉండటం, సమృద్ధిగా ఉన్న పచ్చికభూములు కారణంగా, జింకలు మరియు కృష్ణ జింకల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. సంగారెడ్డి జిల్లాలోని ఈ భాగాన్ని ఈ అందమైన జీవులకు నిజమైన స్వర్గధామంగా మార్చింది.
ఈ మేరకు బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఓవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఇవి చాలవన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అటవీ జంతువులు బయటకు వస్తూ వీక్షకులను కనువిందు చేస్తున్నాయి.
తెలంగాణలో భారీగా వర్షాలు కురవడంతో అడవుల నుంచి బయటికి వచ్చిన జింకలు
సంగారెడ్డిలో జింకల సందడి pic.twitter.com/20jfuwuj3k
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2023
Related News
Sangareddy: బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టి చంపిన కాంగ్రెస్ కార్యకర్తలు
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. దీంతో స్థానిక ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే..