Crime: దారుణం.. మహిళను చంపి ఆపై 50 ముక్కలుగా చేసి అలా?
- By Nakshatra Published Date - 09:13 PM, Sun - 18 December 22
Crime: సమాజంలో రోజురోజుకీ ఆడవారి పై జరుగుతున్న అత్యాచారాలు, మానసిక వేధింపులు, హత్యలు ఆగడం లేదు. ప్రభుత్వాలు తప్పు చేసిన నిందితుల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కాగా ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తన భాగస్వామిని చంపి అనంతరం 35 ముక్కలుగా నరికి అత్యంత దారుణంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. తాజగా దీనికంటే మరో ఘోరమైన ఒళ్ళు గగ్గుర్పుడిచే సంఘటన ఒకటి తోటి చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ దారుణమైన ఘటన ఝార్ఖండ్లోని సాహెబ్ గంజ్ జిల్లా, బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఈ ఘటనతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చనిపోయిన బాధితురాలు రుబికా పహాదిన్ అని 23 ఏళ్ల యువతి తో సిల్దార్ అన్సారి అనే 28 ఏళ్ల వ్యక్తి రెండేళ్ల పాటు సహజీవనం చేసి ఇటీవలే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే అతనికి ఇది రెండవ వివాహం. ఆ మహిళను చంపిన అతడు తప్పించుకునే క్రమంలోనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. తాజాగా శనివారం సాయంత్రం 6 గంటలకు సమయంలో సంతాలి మోమిన్ తోలా ప్రాంతంలో ఒక పాత ఇంటి వద్ద మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించి వెంటనే రంగంలోకి దిగారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కొన్ని భాగాలు మిస్ అయ్యాయని తెలిపారు. వాటికోసం అన్వేషిస్తున్నట్టుగా కూడా తెలిపారు. నిందితుని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్టుగా వాళ్ళు వెల్లడించారు. తన భార్యను చంపీ అనంతరం ముక్కలు ముక్కలుగా కోయడానికి నిందితుడు ఎలక్ట్రిక్ కట్టర్ లాంటి పదునైన ఆయుధాలను ఉపయోగించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అతను తన భార్యను ఎందుకు చంపాడు అన్న వివరాలు మాత్రం తెలియడం లేదు.
Related News
Five Burnt Alive : ఐదుగురు సజీవ దహనం.. ప్రైవేట్ ట్రావెల్స్ను ఢీకొన్న టిప్పర్
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.