లాహోర్ వీధుల్లో నిప్పుకోడి – వీడియో వైరల్
పాకిస్థాన్ రాజధాని లాహోర్ వీధుల్లో రెండు ఉష్ణపక్షలు పరుగులు పెట్టాయి.
- By Hashtag U Published Date - 11:16 AM, Thu - 28 October 21
పాకిస్థాన్ రాజధాని లాహోర్ వీధుల్లో రెండు ఉష్ణపక్షలు పరుగులు పెట్టాయి. లాహోర్లోని హైవే మధ్యలో ఈ పక్షులు వేగంగా పరిగెత్తుతూ వాహనదారుల కంటపడ్డాయి. ఈ సంఘటన లాహోర్ కెనాల్ రోడ్లో జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వారు దీనిని వీడియో తీయగా ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఈ వీడియోకు ఇప్పుడు 80,000 పైగా వీవ్యూస్ వచ్చాయి.
ఈ ఉష్ణపక్షులు లాహోర్ శివార్లులోని ఓ ప్రదేశం నుంచి వచ్చినట్లు అక్కడి అధికారులు గుర్తించారు.అయితే వీటిని పట్టుకునేందుకు చాలామంది వాహనదారులు ప్రయత్నించారు.చివరికి ఒక పక్షిని పట్టుకుని అందరి చేతుల్లో నలిగిపోవడంతో ఆ పక్షి చనిపోయింది.దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అలా రోడ్డుపై ఉన్న పక్షులను కాపాడాల్సింది పోయి వాటి ప్రాణం తీయడం దారుణమంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Related News
Maggi Noodles : నూడుల్స్ తిని బాలుడు మృతి.. కారణం తెలిస్తే షాక్..!
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన జరిగింది. మ్యాగీ నూడుల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందాడు.