Urvashi vs Rishabh: పంత్కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతాలా, భారత క్రికెట్ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది.
- By Naresh Kumar Published Date - 05:40 PM, Fri - 12 August 22
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతాలా, భారత క్రికెట్ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. ఒకరికొకరు తగ్గేదే లేదంటూ పోటాపోటీ ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
అసలేం జరిగిందంటే గతంలో ఊర్వశి రౌతేలా కోసం రిషబ్ పంత్ ఎయిర్ పోర్ట్లో గంటల తరబడి వేచి చూశాడని, వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఊర్వశి తన కోసం ఆర్పీ అనే వ్యక్తి ఎయిర్పోర్ట్లో గంటల తరబడి వేచి చూశాడని చెప్పింది. అయితే తను షూటింగ్కు వెళ్లి అలసిపోవడం వల్ల జర్నీలో పడుకుండిపోయానంది.
లేచి చూసేసరికి అతని నుంచి 16 నుంచి 17 మిస్డ్ కాల్స్ వచ్చాయంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆర్పీ ఎవరని అడగ్గా తాను పేరు చెప్పలేనని తెలిపింది. దీంతో అందరు అది రిషబ్ పంత్ అనుకోవడం.. పలు వార్తలు షికారు చేయడం.. దీనిపై పంత్ స్పందించడంతో మరో టర్న్ తీసుకుంది.. ఆమె పేరు ప్రస్తావించకుండానే రిషబ్ తనపై కామెంట్స్ను తిప్పి కొట్టాడు. కొంతమంది ఫేమ్ కోసం అబద్ధాలు ఎలా అడతారో అర్థం కాదని, వారి స్వలాభం కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందుల్లో పడేస్తారన్నాడు. అంతేకాదు ప్లీజ్అక్క నన్ను వదిలేయంటూ హ్యాష్ ట్యాగ్తో ఊర్వశికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. తాజాగా రిషబ్ పోస్ట్పై ఊర్వశి రౌతేలా తీవ్రస్థాయిలో మండిపడింది.
అంతేకాదు పంత్ను కౌగర్ హంటర్ అంటూ చురకలు అంటించింది. కౌగర్ హంటర్ అంటే తన కంటే ఎక్కువ వయసున్న అందమైన అమ్మాయిలతో లైంగిక సంబంధం కోరుకునే పురుషుడుగా పంత్ను పోల్చింది. ఈ మేరకు గురువారం ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేసింది. చోటా భయ్యా నువ్వు బ్యాట్ బాల్తో ఆడుకో.. నేను మున్నిని కాదు. నీ లాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఈ పోస్ట్కు రక్షాబంధన్ శుభాకాంక్షలు, ఆర్పీ భాటుభయ్యా, కౌగర్ హంటర్, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ సైలెంట్ గర్ల్ అనే హ్యాష్ట్యాగ్లను జత చేసింది. దీంతో ఊర్వశి పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. తాజా పోస్టుతో పంత్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
Related News
Rishabh Pant: కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన రిషబ్.. ఇలా ఆడితే ఎలా పంత్..!
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేశాడు. ఈ సమయంలో పంత్.. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్లో భారీగా పరుగులు సాధించాడు.