HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Technology Is Revolutionizing Peoples Lifestyle Pm Modi

PM Modi : సాంకేతికత వల్ల ప్రజల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు : ప్రధాని మోడీ

ఇది సాంకేతికత శక్తిని ప్రదర్శించేదిగా నిలుస్తుందని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు. సాంకేతికతను యథార్థంగా వినియోగించుకుంటూ, యువశక్తిని ప్రేరణగా తీసుకుంటూ భారత దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది.

  • Author : Latha Suma Date : 12-06-2025 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Technology is revolutionizing people's lifestyle: PM Modi
Technology is revolutionizing people's lifestyle: PM Modi

PM Modi : గత పదకొండు సంవత్సరాల్లో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజల జీవితాల్లో అపూర్వమైన మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత ప్రభుత్వం ప్రజల వద్దకు ప్రత్యక్షంగా సేవలు చేరే విధానాన్ని సాంకేతికత వల్ల సాధ్యమయ్యిందని, చివరి లబ్ధిదారుడికి కూడా పథకాలు సమయానుగుణంగా అందుతున్నాయని అన్నారు. ఇది సాంకేతికత శక్తిని ప్రదర్శించేదిగా నిలుస్తుందని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు. సాంకేతికతను యథార్థంగా వినియోగించుకుంటూ, యువశక్తిని ప్రేరణగా తీసుకుంటూ భారత దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. అంతర్జాతీయంగా సాంకేతిక శక్తికేంద్రంగా ఎదుగుతున్న భారత్‌కు ఇది మున్ముందు మరింత బలాన్ని ఇస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మార్పుల్లో ముఖ్యంగా పారదర్శకతకు పెద్దపీట వేసిన విధానాలు, ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే విధానాలే కీలకమని చెప్పారు.

Read Also: BCCI Council Meet: బీసీసీఐ కీల‌క స‌మావేశం.. ఇక‌పై క‌ఠినంగా రూల్స్?

ప్రభుత్వ సేవలను ఖచ్చితంగా, పారదర్శకంగా ప్రజలకు అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తోందని ప్రధాని మోడీ వివరించారు. పేదల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందన్నారు. ప్రధానంగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా లక్షలాది మంది లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు చేకూరుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మొత్తం 56 శాఖల పరిధిలో 322కి పైగా సంక్షేమ పథకాలను డీబీటీ ద్వారా అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ పథకాల ద్వారా రూ.44 లక్షల కోట్లకు పైగా నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసినట్టు వెల్లడించారు. దీని ఫలితంగా రూ.3.48 లక్షల కోట్ల మేరా వృథా ఖర్చులను నియంత్రించగలిగామని తెలిపారు.

ఇంతటి పెద్ద ప్రయోజనాల వెనక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన విధానం ఉందని మోడీ గుర్తుచేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా, ఆధార్ ఆధారిత సేవలు, మొబైల్ ఆధారిత బ్యాంకింగ్ వంటివి ఈ మార్పుల్లో కీలకమైనదిగా పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగించడం అంటే కేవలం సౌకర్యం మాత్రమే కాదు, అది సమానత్వం, పారదర్శకత, సామర్ధ్యం యొక్క ప్రతీక అని ప్రధాని మోడీ చెప్పారు. ప్రజా సంక్షేమంలో సాంకేతికత వ్యవస్థాపిత మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also: Tollywood : కొలిక్కి రానున్న టాలీవుడ్ సమస్యలు..సీఎం చంద్ర‌బాబుతో సినీ పెద్ద‌ల భేటీ

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aadhaar based services
  • Digital India
  • pm modi
  • technology
  • youth power

Related News

AI revolution in the Indian job market

భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం

సంప్రదాయ రిజ్యూమేలు, ఇంటర్వ్యూల పరిమితులను దాటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ వేదిక లింక్డ్ఇన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2026 నాటికి దేశంలోని 90 శాతం కంటే ఎక్కువ మంది నిపుణులు ఉద్యోగాన్వేషణలో ఏఐ సాధనాలను వినియోగించాలని భావిస్తున్నారు.

  • Congress Leader

    ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ నాయ‌కుడు సంచలన వ్యాఖ్యలు!

  • PM Kisan Yojana

    పీఎం కిసాన్ 22వ విడత అప్డేట్‌.. ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం!

Latest News

  • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

  • జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

  • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

  • రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలివే..!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd