Lok Sabha Elections : ఏడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- By Latha Suma Published Date - 11:49 AM, Wed - 8 May 24
Lok Sabha Elections: దేశంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికల జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్(Election Commission) బుధవారం లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ్టి (బుధవారం) నుండి ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వగా.. 15న నామినేషన్లను స్క్రూటీని చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 1న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లోని ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్ 9, ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13 , బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్లో 3 స్థానాలకు లాస్ట్ ఫేజ్లో పోలింగ్ జరగనుంది. ప్రధాని మోడీ పోటీ చేస్తోన్న వారణాసి లోక్ సభ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది.
Read Also: Pakistan Vs Shinde : పాక్ భాష మాట్లాడే వాళ్లపై దేశద్రోహం కేసు పెట్టాలి.. సీఎం కామెంట్స్
Related News
Voting : హైదరబాద్లో అందరూ ఎక్కడికి వెళ్లారు..? ఓటింగ్ శాతం ఎందుకిలా..?
హైదరాబాద్ నడిబొడ్డున, స్పైసీ బిర్యానీ వాసనలు , వీధులు ఎప్పుడూ రద్దీగా ఉండే వీధుల్లో, పునరావృతమయ్యే అయోమయ పరిస్థితి ఉంది.