HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Sbi Moves Supreme Court Seeks More Time To Furnish Electoral Bond Details

Electoral Bonds SBI : ‘ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలపై మరింత గడువు కావాలి’: సుప్రీంను కోరిన ఎస్‌బీఐ

  • Author : Latha Suma Date : 05-03-2024 - 10:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sbi Moves Supreme Court, Se
Sbi Moves Supreme Court, Se

 

Electoral Bonds SBI : ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి సమర్పించేందుకు జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)సుప్రీంకోర్టు(Supreme Court)ను కోరింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి తాజాగా అప్లికేషన్‌ పెట్టుకొన్నది. 2019, ఏప్రిల్‌ 12 నుంచి 2024, ఫిబ్రవరి 15 వరకు రాజకీయ పార్టీలకు విరాళాల కోసం 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు(Electoral Bonds) జారీ చేశామని, వాటికి సంబంధించిన వివరాలు సమర్పించేందుకు సుప్రీంకోర్టు పెట్టిన మూడు వారాల గడువు సమయం సరిపోదని ఎస్బీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్ల జారీ ప్రతి దశ ముగింపులో రిడీమ్‌ అయిన బాండ్లను అధీకృత బ్రాంచ్‌లు ముంబైలోని ప్రధాన బ్రాంచ్‌లో డిపాజిట్‌ చేశామని పేర్కొన్నది.

రెండు వేర్వేరు సమాచారాలు ఉన్నందున, మొత్తంగా 44,434 సమాచార సెట్‌లను డీకోడ్‌ చేసి, సరిపోల్చాల్సి ఉంటుందని తెలిపింది. ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ పథకాన్ని గత నెల 15న కొట్టివేసిన విషయం తెలిసిందే. ఎన్నికల బాండ్ల జారీని ఎస్బీఐ వెంటనే నిలిపివేయాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

అదేవిధంగా 2019, ఏప్రిల్‌ 12 నుంచి రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల అన్ని వివరాలను (కొనుగోలు చేసినవారు, కొనుగోలు తేదీ, ఎంత మొత్తం కొనుగోలు చేశారు) మార్చి 6వ తేదీలోగా ఎస్బీఐ.. ఈసీకి సమర్పించాలని, మార్చి 13లోగా ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ఈసీ ప్రచురించాలని ఆదేశాలు ఇచ్చింది. ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ అమలు సమాచార హక్కు ఉల్లంఘన అవుతుందని, క్విడ్‌ ప్రోకోకు దారితీసే ప్రమాదమూ ఉన్నదని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. నల్లధనాన్ని కట్టడికి ఇదొక్కటే మార్గం కాదని అభిప్రాయపడింది.

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఈసీ సమర్పించేందుకు గడువు పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని విపక్ష నేతలు వ్యతిరేకించారు. ఇది ప్రధాని మోదీ ‘నిజ రూపాన్ని’ దాచేందుకు లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం చేస్తున్న చివరి ప్రయత్నమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ‘విరాళాల వ్యాపారాన్ని’ దాచిపెట్టేందుకు మోదీ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని రాహుల్‌ తన ఎక్స్‌ పోస్టులో ఆరోపించారు. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను తెలుసుకోవడం ప్రజల హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొన్నదని, అయితే ఎన్నికలకు ముందు ఎస్బీఐ ఈ వివరాలను బహిరంగపరిచేందుకు ఎందుకు సిద్ధంగా లేదని ప్రశ్నించారు. ‘వారి అవినీతిని దాచేందుకు దేశంలోని ప్రతి స్వతంత్ర సంస్థ ‘మోదానీ’ ఫ్యామిలీలో భాగంగా మారింది’ అని రాహుల్‌ ఆరోపించారు.

read slao : Abortion Right : అబార్షన్‌ ఇక మహిళల రాజ్యాంగ హక్కు

మరోవైపు ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనుమానాలను పెంచుతున్నదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ చర్య న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ‘క్విడ్‌ప్రోకో’ బయటపడకుండా ప్రధాని మోడీ, బీజేపీని కాపాడేందుకే ఎస్బీఐ లోక్‌సభ ఎన్నికల తర్వాతి వరకు గడువు కోరిందని ఆరోపించారు. నేటి డిజిటల్‌ కాలంలో సమాచారం అంతా ‘మౌస్‌ క్లిక్‌’ దూరంలో ఉంటుందని, అయితే ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల సమర్పణకు గడువు పొడిగింపు కోరడం అనుమానాలకు తావిస్తున్నదని ఏచూరి అన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ec
  • Electoral Bonds
  • sbi
  • Supreme Court

Related News

Supreme Court Strong Warning To YCP MLC Anantha Babu

అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం

Ananta Babu case  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో పోలీసులు ఈ కేసు విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలు, నిందితుడు ఒక్కటయ్యారు అనే రీతిలో వ్యవహరించారని మండిపడింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును వ

  • Telangana Cm Revanth Reddy

    CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • Ias Srilakshmi

    ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • Prathyusha Death Case

    Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

Latest News

  • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

  • పచ్చి బీట్‌రూట్ తింటున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి!

  • అమెరికాలో తెలుగు యువకుడి మృతి

  • మరోసారి టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన తాప్సి

  • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

Trending News

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd