Woman Whipped:మహిళపై మూఢనమ్మకాల కొరడా.. తమిళనాడులో రెచ్చిపోయిన తాంత్రికులు!!
కంప్యూటర్ యుగంలోనూ మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. భూతప్రేతాలపై నమ్మకాలు పట్టిపీడిస్తున్నాయి.
- By Hashtag U Published Date - 01:21 PM, Sat - 28 May 22
కంప్యూటర్ యుగంలోనూ మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. భూతప్రేతాలపై నమ్మకాలు పట్టిపీడిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో ఉన్న వరదరాజ పెరుమాళ్ చెల్లిఅమ్మన్ మర్రిఅమ్మన్ ఆలయం లో ఈవిధమైన ఓ ఘటన చోటుచేసుకుంది. గత నెల రోజులుగా ఈ గుడిలో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఇటీవల ఊరి నడిబొడ్డున ఒక సమావేశం జరిగింది.
ఇందులో నల్లటి వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు కొరడా పట్టుకొని ఊగిపోయారు. చుట్టూ నిలపడ్డ వారిలో ఒక మహిళపై చేతబడులు జరుగుతున్నా యంటూ ప్రకటించారు. ఆ మహిళను ముందుకు పిలిచి.. కొరడా తో ఎడాపెడా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 18 గ్రామాల ప్రజలు చుట్టూ నిలబడి .. ఈ తంతును కళ్లారా చూశారు. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చివరకు ఆ బాధిత మహిళ కూడా రెండు చేతులు జోడించి మొక్కుతూ కొరడా దెబ్బలు భరించింది. ఈ కార్యక్రమంతో ఊరికి మేలు జరుగుతుందని గ్రామస్తులు నమ్ముతుండటం గమనార్హం. 20 ఏళ్ల క్రితం ఈ తరహా కార్యక్రమం గుడి లో నిర్వహించారు. రెండు వర్గాల మధ్య గొడవతో మధ్యలో ఆగిపోయిన ఈ కార్యక్రమం మళ్లీ ఇప్పుడు మొదలైందని స్థానికులు తెలిపారు.
Related News
666 Crores Jewels : రూ.666 కోట్ల బంగారు ఆభరణాల కంటెయినర్ బోల్తా.. ఏమైందంటే ?
666 Crores Jewels : రూ.666 కోట్లు విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడింది.