Video: రైలును వెనక్కి నెట్టిన ప్రయాణికులు.. సోషల్ మీడియాలో వైరల్..!
- By HashtagU Desk Published Date - 03:18 PM, Sat - 5 March 22
ఉత్తరప్రదేశ్లో ప్రయాణికులు చేసిన సాహసం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. యూపీలోని మీరట్ జిల్లాలో ఉన్న దౌరాలా రైల్యే స్టేషన్లో మార్చి 5 శనివారం ఉదయం షహరాన్పూర్-ఢిల్లీ ప్యాసింజర్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ రైలు ఇంజిన్తో పాటు రెండు ఇంజిన్ తర్వాత ఉన్న రెండు బోగీలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
అయితే ఇక్కడ వైరల్ మ్యాటర్ ఏంటంటే.. ఆ మంటలు మిగతా బోగీలకు అంటుకోకుండా ప్రయాణికులు చేసిన సాహసం గురించి, సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. మంటలు మిగతా బోగీలకు అంటుకోకుండా ఉండేందుకు, ఆ ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కిందికి దిగి రైలును తోశారు. దీంతో ఆ రెండు బోగీలు, ఇంజిన్ నుంచి వేరుపడిన మిగతా బోగీలను తోసుకుంటూ దూరంగా తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పెద్ద ప్రమాదంగా మారకుండా ఉండేందుకు ప్రయాణికులు ఏకంగా రైలునే తోయడం, ఈ వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut.
Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022
Related News
Vote : ఓటు విలువ ప్రాసలో అదరకొట్టిన తీరుకు నెటిజన్ల ఫిదా
భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ..ఓటర్లలో ఓటు పాదాన్యం తెలియజేస్తూ వస్తున్నారు