PARTYWISE LEAD : 115 స్థానాల్లో కాంగ్రెస్, 73 స్థానాల్లో బీజేపీ, 29 స్థానాల్లో జేడీఎస్
కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ లాంటిదనే టాక్ నేపథ్యంలో ఈరోజు యావత్ దేశం దృష్టి కర్ణాటకపై ఉంది. ఉదయం కౌంటింగ్ మొదలుకాగానే కాంగ్రెస్ పార్టీ 108 స్థానాల్లో లీడ్ (partywise lead)లో ఉందనే అంచనాలు వెలువడ్డాయి.
- Author : Pasha
Date : 13-05-2023 - 9:49 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ లాంటిదనే టాక్ నేపథ్యంలో ఈరోజు యావత్ దేశం దృష్టి కర్ణాటకపై ఉంది. ఉదయం కౌంటింగ్ మొదలుకాగానే కాంగ్రెస్ పార్టీ 108 స్థానాల్లో లీడ్ (partywise lead)లో ఉందనే అంచనాలు వెలువడ్డాయి. ఉదయం 9 గంటల 44 నిమిషాల సమయానికి 115 స్థానాల్లో కాంగ్రెస్, 73 స్థానాల్లో బీజేపీ, 29 స్థానాల్లో జేడీఎస్ లీడ్ (partywise lead) లో ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలుకాగానే.. 108 స్థానాల్లో కాంగ్రెస్ (congress leads 108) పార్టీ ఆధిక్యంలో ఉందని ప్రాథమిక సమాచారం(karnataka election result) బయటికి వచ్చింది. దీంతో న్యూఢిల్లీల్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
also read : congress leads 108 :108 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.. ఢిల్లీలో ముందస్తు సంబురాలు
ఎగ్జిట్ పోల్స్ లో కూడా..
ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను గెల్చుకొని(karnataka election result) అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందనే అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు విజయ అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వెలువడటంతో.. తమ ఎమ్మెల్యేలు అందరూ వెంటనే బెంగళూరుకు వచ్చేయాలని ఆ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఇవాళ ఉదయం 8 గంటలకు కర్ణాటకలోని మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్ ఓట్లను లెక్కించారు. ఇది ముగిశాక.. ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించడం స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు(karnataka election result) వచ్చేస్తాయి.