HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Mp Arvind Dharmapuri Interesting Comments On Kcr

Arvind Dharmapuri : కేసీఆర్ మాటలు మిస్సవుతున్నా..ఎంపీ అర్వింద్

Arvind Dharmapuri : కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసిందని ఫైరయ్యారు. మాహేశ్వర్ రెడ్డి ఎల్పీ నేత అయినప్పటి నుంచి ఎన్నో స్కాములు, అవినీతిని బట్టబయలు చేశాడని అర్వింద్ తెలిపారు.

  • Author : Latha Suma Date : 30-09-2024 - 9:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mp Arvind Dharmapuri Interesting Comments On Kcr
Mp Arvind Dharmapuri Interesting Comments On Kcr

Rythu Hamila Sadhana Deeksha : బీజేఎల్పీ నేతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్షను సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలను చాలా మిస్సవుతున్నట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో ఆయన పులిలా ఉన్నారని, కానీ ఇప్పుడు పిల్లిలాగా అయ్యారని విమర్శలు చేశారు. కేసీఆర్.. తెలంగాణను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోందని చురకలంటించారు. కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసిందని ఫైరయ్యారు. మాహేశ్వర్ రెడ్డి ఎల్పీ నేత అయినప్పటి నుంచి ఎన్నో స్కాములు, అవినీతిని బట్టబయలు చేశాడని అర్వింద్ తెలిపారు. కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో సీట్లు రాలేదని, వాళ్లకు గ్రామీణ ప్రాంతాల ఓట్లు వచ్చాయని, అందుకే గ్రేటర్ పరిధిలో పేదల ఇండ్లు కూలుస్తోందని మండిపడ్డారు.

Read Also: Hyd : మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఎల్అండ్‌టీ యాజమాన్యం

గతంలో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రాగానే రాచరిక పాలన సాగించారన్నారు. ఆయనపై మాట్లాడితే.. కార్లు, ఇండ్లపై దాడులు జరిగాయని, అందుకే ప్రజలు కర్రు కాల్చి, వాత పెట్టి గద్దె దింపారన్నారు. తొమ్మిదేండ్లు తెలంగాణలో ప్రజా కంటగింపు పాలనను చూశామని ఆయన పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే నోటీస్ లేదు.. నేరుగా కూలుస్తున్నారంటూ అర్వింద్ మండిపడ్డారు. ముస్లింలను ఒకలా.. హిందువులను ఒకలా చూస్తున్నారని మండిపడ్డారు. హిందువుల ఇండ్లు మాత్రమే కూలుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా లేదు, బోనస్ ముచ్చటే లేదని విరుచుకుపడ్డారు. ప్రమాదవశాత్తు పంటనష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేడని పేర్కొన్నారు. కేసీఆర్.. ఒక ఎకరాకు రూ.కోటి సంపాదిస్తున్నాడని ఆయనే చెప్పారని, రూ.కోటి సంపాదన ఎలా సాధ్యమో స్టడీ చేసేందుకు ఒక టీమ్‌ను రేవంత్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపై ఆ విధానాన్ని రైతులకు గైడ్ చేయాలని పేర్కొన్నారు. ఇది రేవంత్‌కు తన పర్సనల్ రిక్వెస్ట్ అంటూ అర్వింద్ వ్యాఖ్యానించారు.

Read Also: Muda Scam : సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు

కేటీఆర్‌కు అల్లం, పసుపు ఇచ్చి ఏది ఏంటో చెప్పమంటే ఆయనేంటనేది తేలిపోతుందని అర్వింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ పిత కావల్సింది.. ఇద్దరు పిల్లలకు పితగానే మిగిలాడంటూ ఆయన సెటైర్లు వేశారు. పులికి పుట్టిన ఇద్దరు పిల్లలు అవినీతి చేసి జైలుకు పోతున్నారని, బెయిల్‌పై వస్తున్నారని చురకలంటించారు. కేసీఆర్‌లాగే వరి మాత్రమె వేసుకునే పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చిందని అర్వింద్ మండిపడ్డారు. చనిపోయిన ఇందిరమ్మను కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇంకా బద్నాం చేస్తున్నారని కాంగ్రెస్‌పై ఫైరయ్యారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని హామీ ఇచ్చారని, అలాగే విద్యార్థులకు ఇచ్చిన ఎన్నో హామీలు చూసి తనకు కూడా ఓటేయాలని అనిపించిందని అర్వింద్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పట్టడం ఖాయమని అర్వింద్ నొక్కిచెప్పారు. కేసీఆర్ పిల్లలకు కుక్క కూడా ఓటు వేయదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతలంతా ఇలాగే కలిసి కట్టుగా బలమైన అపొజిషన్‌గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని అర్వింద్ జోస్యం చెప్పారు.

Read Also: Health Tips : శరీరంలో కనిపించే ఈ లక్షణాలు క్యాన్సర్ కణాల అభివృద్ధి కావచ్చు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alleti Maheshwar Reddy
  • Arvind Dharmapuri
  • bjp
  • kcr
  • Rythu Hamila Sadhana Deeksha

Related News

Brs Grama

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం

శాసన సభలో బీఆర్ఎస్ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీశ్ రావు, సబితారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్.రమణ

  • Palamuru Ranga Reddy Lift I

    పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై జరుగుతున్న ప్రచారానికి తెరదించిన ఉత్తమ్

  • Kcr Telangana Assembly

    అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

  • Telangana Legislative Assembly sessions from December 9

    నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మొత్తం చర్చ వాటిపైనేనా ?

  • Amith Sha Bng

    2029లోనూ బిజెపి ప్రభుత్వమే తేల్చి చెప్పిన అమిత్ షా

Latest News

  • మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు

  • J&K ప్రజలకు ఆర్మీ ట్రైనింగ్, ఇక ఉగ్రవాదులకు వణుకే

  • ఆర్థిక వ్యవస్థలో సరికొత్త రికార్డు దిశగా తెలంగాణ రాష్ట్రం

  • రేపటి నుండి 8వ వేతన సంఘం అమలు

  • ఏపీలో ఒకరోజు ముందే పెన్షన్లు, సంబరాల్లో పెన్షన్ దారులు

Trending News

    • కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!

    • రేపే ఏకాద‌శి.. ఇలా చేయ‌కుంటే పూజ చేసిన వృథానే!!

    • ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

    • రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

    • 2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd