HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ktr Power Point Presentation On Hydraa

Hydraa : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం..ఇదే హైడ్రా తీరు – కేటీఆర్

Hydraa : “హైడ్రా రాత్రి వేళల్లో ఇళ్లను కూల్చడం ఎందుకు? ఇది న్యాయపరమైన చర్య అయితే, నోటీసులు ఇవ్వడానికి ఏమిటి భయం?” అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే నిలిచిందని, ఎవరిపైనా అన్యాయం జరగకుండా

  • Author : Sudheer Date : 02-11-2025 - 3:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Hydraa
Ktr Hydraa

హైదరాబాద్‌లో “పెద్దవాళ్లకు ఒక న్యాయం… పేదవాళ్లకు ఒక న్యాయం” అనే నినాదంతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రేరణతో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హైడ్రా చర్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యానిస్తూ, హైద‌రాబాద్‌లో హైడ్రా పేరుతో ప్రభుత్వం అన్యాయాలు, అరాచకాలు చేస్తున్నదని ఆరోపించారు. చాంద్రాయణగుట్టలో పేదవారి స్కూల్‌ను కూడా కూల్చేశారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అంతా అభివృద్ధి పనులతో నిండిపోయిందని, లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు, సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, నీటి ప్రాజెక్టులు, కలెక్టర్ కార్యాలయాలు అన్నీ నిర్మించినట్లు గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో ఒక ఇటుక కూడా వేయలేదని, కూల్చడమే తప్ప కొత్తగా ఏది చేయలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Vijay Karur Stampede : నటుడు విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు!

హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి, పెద్దవారి నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. భట్టి విక్రమార్క ప్రజెంటేషన్‌లో బిల్డర్ల పేర్లు ఉన్నప్పటికీ, ప్రభుత్వం వారిపై చర్య తీసుకోలేదని అన్నారు. చెరువులలో, నదుల ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో నిర్మాణాలు చేసిన మంత్రులు, నేతల ఇళ్లపై హైడ్రా ధైర్యం చూపలేదని ఉదాహరణలతో వివరించారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నేతల ఇళ్లు చెరువుల్లో ఉన్నప్పటికీ, వారిపై నోటీసులు లేవని కేటీఆర్ మండిపడ్డారు. పేదవారిని మాత్రం రాత్రిళ్లు బుల్డోజర్లు పంపించి ఇళ్లను కూల్చుతున్నారని అన్నారు. “పేదల ఇళ్లను కూల్చడం న్యాయం అయితే, పెద్దల నిర్మాణాలపై మౌనం ఎందుకు?” అని ఆయన నిలదీశారు.

IND W vs SA W: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు వర్షం ముప్పు!

“హైడ్రా రాత్రి వేళల్లో ఇళ్లను కూల్చడం ఎందుకు? ఇది న్యాయపరమైన చర్య అయితే, నోటీసులు ఇవ్వడానికి ఏమిటి భయం?” అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే నిలిచిందని, ఎవరిపైనా అన్యాయం జరగకుండా చూసిందని చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పేదల ఇళ్లు కూల్చడం, ఆర్మీ కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టడం, న్యాయపరంగా దోపిడీ చేయడం జరుగుతోందని విమర్శించారు. “మూడు సంవత్సరాల చిన్నారి భోజనం లేక ఏడ్చే పరిస్థితి వస్తే, దానికంటే దారుణం ఇంకేముంటుంది?” అని ప్రశ్నించారు. 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పటికి హైడ్రా బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. “మా పదేళ్ల పాలనలో ఎవరికి అన్యాయం జరగలేదు అదే బాధ్యతతో మేము తిరిగి వస్తాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • hyderabad
  • HYDRAA
  • ktr
  • KTR powerpoint

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

  • Kushals Fashion Jewelry expands significantly in Hyderabad

    ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్‌లు: కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ఘన విస్తరణ

  • Global Capability Center launched in Hyderabad

    హైదరాబాద్‌లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం

  • Bank Employees 5 Days Work

    కదం తొక్కిన బ్యాంకు ఉద్యోగులు, మరి వీరి డిమాండ్స్ నెరవేరుతాయా ?

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

  • అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd