HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Jayakethanam Arrangements Have Been Made To Seat 250 People On The Assembly Stage

Janasena : ‘జయకేతనం’..సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు

సభా ప్రాంగణంలో 15 ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. 1700 మంది పోలీసులను ఈ సభ బందోబస్తుకు కేటాయించారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.

  • By Latha Suma Published Date - 02:35 PM, Fri - 14 March 25
  • daily-hunt
'Jayakethanam'..Arrangements have been made to seat 250 people on the assembly stage
'Jayakethanam'..Arrangements have been made to seat 250 people on the assembly stage

Janasena : కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు తరలివస్తున్నారు. ‘జయకేతనం’ పేరిట నిర్వహిస్తున్న ఈ సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కాకినాడ – పిఠాపురం – కత్తిపూడి మార్గంలో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సభా ప్రాంగణంలో 15 ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. 1700 మంది పోలీసులను ఈ సభ బందోబస్తుకు కేటాయించారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.

Read Also: Nara Lokesh : మంగళగిరి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తా – మంత్రి నారా లోకేశ్

గత 12 రోజులుగా 470 మంది సాంకేతిక నిపుణులతో సభా వేదిక ప్రాంగణంలో ఆడియో, వీడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరంలో ఉన్న వారికీ వీఐపీ గ్యాలరీలో ఉన్న అనుభూతి కలిగేలా ఆడియో సిస్టమ్స్ సిద్ధమయ్యాయి. 23 ఎల్ఈడీ వాల్స్‌తో పాటు ఇటలీకి చెందిన లైనర్ రేస్‌తో నిర్మాణం చేపట్టారు. ఎన్‌ఆర్‌ఐ ప్రశాంత్‌ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సభలకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్, బిల్‌ క్లింటన్‌, జార్జి బుష్ సభలతో పాటు మనదేశంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సభలకు ఏర్పాట్లు చేసిన అనుభవం ప్రశాంత్‌కు ఉంది.

ఇక, జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి 3.45 గంటలకు చిత్రాడలోని ప్రాంగణానికి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. తొలుత తెలుగుభాష ప్రాధాన్యం, పార్టీ విశేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చివర్లో పవన్‌కల్యాణ్‌ కూటమి ప్రభుత్వ ప్రగతిపథం, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వివరించనున్నారు. ఈ సభ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే అవకాశం ఉంది.

Read Also: Bihar : తల్లి-కుమారుని కలిపిన ఇంటర్నెట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Drones
  • Jana Sena Party Formation Day
  • Janasena
  • kakinada district
  • pithapuram
  • VIP Gallery

Related News

Pithapuram

Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం పిఠాపురంలోని కుక్కుటేశ్వరుడి దేవాలయంలో ఉండేది. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. Pithapuram Charitra : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం హాట్‌ టాపిక్‌. ఏ నోట విన్నా పిఠాపురం మాటే. ఈ పిఠాపురం.. కాకినాడ జిల్లాలో ఉంది. అయితే.. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపత

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd