Rangareddy District :ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి
ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
- By Latha Suma Published Date - 06:11 PM, Mon - 2 December 24

Road Accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ – బీజాపూర్ రహదారి వద్ద దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
పలువురి పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనతో వ్యాపారులు భయంతో పరుగులు తీశారు. లారీ వేగంతో చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రహదారిపై భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.