HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Emergency Rule Is A Dark Chapter Bandi Sanjay

Bandi Sanjay : ఎమర్జెన్సీ పాలన చీకటి అధ్యాయం : బండి సంజయ్‌

ఆ రోజు దేశమంతా నియంతృత్వపు నీడలో మునిగిపోయింది. అధికారపు దాహంతో ఉన్మత్తమైన కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను గల్లంతు చేసింది. భావ ప్రకటన హక్కును అణిచేసింది. న్యాయవ్యవస్థను వంకరగొట్టింది.

  • Author : Latha Suma Date : 25-06-2025 - 11:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay : దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ మాయ మచ్చగా మిగిలిపోయిన ఎమర్జెన్సీకి సంబంధించి, కేంద్ర మంత్రి బండి సంజయ్ బుగ్గ తడి చేస్తూ గళం విప్పారు. భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి సరిగ్గా 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, బండి సంజయ్ “ఎక్స్‌” వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జూన్ 25, 1975… ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన నల్ల రోజు. ఆ రోజు దేశమంతా నియంతృత్వపు నీడలో మునిగిపోయింది. అధికారపు దాహంతో ఉన్మత్తమైన కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను గల్లంతు చేసింది. భావ ప్రకటన హక్కును అణిచేసింది. న్యాయవ్యవస్థను వంకరగొట్టింది.

Read Also: Kannappa First Day Collections : కన్నప్ప ఫస్ట్ డే టార్గెట్ గట్టిగానే పెట్టుకున్నాడే..!!

మీడియా గొంతు కోసింది. ఇది స్వేచ్ఛాపూరిత దేశానికి తలవంచే ఘట్టం అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో వేలాది మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు అరెస్టు కావడం, పత్రికలపై తుది నియంత్రణలు విధించడం, న్యాయ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభావితం చేయడం వంటి దుశ్చర్యలు ప్రజాస్వామ్యానికి తీవ్ర చేటు చేశాయని ఆయన అన్నారు. ఆ చీకటి పాలనలో ప్రజల స్వేచ్ఛ కుదిపేసారు. రాజ్యాంగ విలువలకు కట్టెలు వేశారు. గర్భస్రావాల వరకు బలవంతంగా చేయించిన ఘోరాలు మనల్ని ఇంకా కలవరపెడుతుంటాయి, అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ..అనేకమంది మహనీయులు, విపక్ష నాయకులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. జైళ్లలో మగ్గారు. దేశం కోసం త్యాగాలిచ్చారు. అలాంటి వీరులను ఈ సందర్భంగా స్మరించుకుందాం. వారి త్యాగాలతో ప్రజాస్వామ్యం తిరిగి పునరుద్దరించబడింది అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు అదే నియంతృత్వ భావజాలంతో పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలపర్చేందుకు ప్రతి ఒక్కరు కట్టుబడాలి. నాటి ఘోరాలను మనసులో దాచుకుంటూ, చరిత్రను మరిచిపోకుండా భవిష్యత్తు తరాలకు చెప్పాలి అని అన్నారు. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ దశకాలుగా ప్రజల మదిలో భయం, వ్యతిరేకత రేకెత్తిస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛల కోసం నిరంతరం నిబద్ధతతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణే నిజమైన దేశ సేవ అని పేర్కొంటూ తన సందేశాన్ని ముగించారు.

Read Also: Zohran Mamdani : న్యూయార్క్‌ మేయర్‌ అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • congress
  • Emergency rule
  • political parties

Related News

Ktr Sit

కొంపలు ముంచిందే కేటీఆర్ అలాంటిది అతడ్నే సాక్షిగా పిలిస్తే ఎలా ? బండి సంజయ్

"తెలంగాణ ప్రజల ప్రైవసీని దెబ్బతీసి, కొంపలు ముంచిన ఈ వ్యవహారం చూస్తుంటే మా రక్తం మరుగుతోంది" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల అసలు సూత్రధారులు తప్పించుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు

  • Bhatti Ap Congress

    మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం – భట్టి

  • Komatireddy Venkat Reddy

    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కు సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి

  • Karnataka Assembly

    కర్ణాటక అసెంబ్లీలో కలకలం.. సభ మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్

Latest News

  • మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

  • డైరెక్టర్ శంకర్ ఇంట విషాద ఛాయలు

  • అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం పై అనుమానాలు !!

  • పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!

  • 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ ?

Trending News

    • అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !

    • జమ్మూ కాశ్మీర్ లో భారీ మంచు తుపాను

    • అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి తెలిపిన సంచలన నిజాలు

    • Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

    • దంప‌తుల మ‌ధ్య‌ గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd