HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Emergency Rule Is A Dark Chapter Bandi Sanjay

Bandi Sanjay : ఎమర్జెన్సీ పాలన చీకటి అధ్యాయం : బండి సంజయ్‌

ఆ రోజు దేశమంతా నియంతృత్వపు నీడలో మునిగిపోయింది. అధికారపు దాహంతో ఉన్మత్తమైన కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను గల్లంతు చేసింది. భావ ప్రకటన హక్కును అణిచేసింది. న్యాయవ్యవస్థను వంకరగొట్టింది.

  • Author : Latha Suma Date : 25-06-2025 - 11:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay : దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ మాయ మచ్చగా మిగిలిపోయిన ఎమర్జెన్సీకి సంబంధించి, కేంద్ర మంత్రి బండి సంజయ్ బుగ్గ తడి చేస్తూ గళం విప్పారు. భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి సరిగ్గా 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, బండి సంజయ్ “ఎక్స్‌” వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జూన్ 25, 1975… ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన నల్ల రోజు. ఆ రోజు దేశమంతా నియంతృత్వపు నీడలో మునిగిపోయింది. అధికారపు దాహంతో ఉన్మత్తమైన కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను గల్లంతు చేసింది. భావ ప్రకటన హక్కును అణిచేసింది. న్యాయవ్యవస్థను వంకరగొట్టింది.

Read Also: Kannappa First Day Collections : కన్నప్ప ఫస్ట్ డే టార్గెట్ గట్టిగానే పెట్టుకున్నాడే..!!

మీడియా గొంతు కోసింది. ఇది స్వేచ్ఛాపూరిత దేశానికి తలవంచే ఘట్టం అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో వేలాది మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు అరెస్టు కావడం, పత్రికలపై తుది నియంత్రణలు విధించడం, న్యాయ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభావితం చేయడం వంటి దుశ్చర్యలు ప్రజాస్వామ్యానికి తీవ్ర చేటు చేశాయని ఆయన అన్నారు. ఆ చీకటి పాలనలో ప్రజల స్వేచ్ఛ కుదిపేసారు. రాజ్యాంగ విలువలకు కట్టెలు వేశారు. గర్భస్రావాల వరకు బలవంతంగా చేయించిన ఘోరాలు మనల్ని ఇంకా కలవరపెడుతుంటాయి, అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ..అనేకమంది మహనీయులు, విపక్ష నాయకులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. జైళ్లలో మగ్గారు. దేశం కోసం త్యాగాలిచ్చారు. అలాంటి వీరులను ఈ సందర్భంగా స్మరించుకుందాం. వారి త్యాగాలతో ప్రజాస్వామ్యం తిరిగి పునరుద్దరించబడింది అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు అదే నియంతృత్వ భావజాలంతో పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలపర్చేందుకు ప్రతి ఒక్కరు కట్టుబడాలి. నాటి ఘోరాలను మనసులో దాచుకుంటూ, చరిత్రను మరిచిపోకుండా భవిష్యత్తు తరాలకు చెప్పాలి అని అన్నారు. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ దశకాలుగా ప్రజల మదిలో భయం, వ్యతిరేకత రేకెత్తిస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛల కోసం నిరంతరం నిబద్ధతతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణే నిజమైన దేశ సేవ అని పేర్కొంటూ తన సందేశాన్ని ముగించారు.

Read Also: Zohran Mamdani : న్యూయార్క్‌ మేయర్‌ అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • congress
  • Emergency rule
  • political parties

Related News

Congress ranks call for movement in wake of National Herald case

నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

ఈ కేసును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా ఉపయోగించిందని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా వేధింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

  • Changes in Congress's action on National Employment Guarantee.

    జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • Telangana Speaker G Prasad Kumar

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Lok Sabha

    లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

Latest News

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd