8th Pay Commission Impact: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. జీతం 100% పెరగనుందా?
ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లలో పెను మార్పులు రావచ్చు. దీని కింద ఉద్యోగులందరి జీతాల నిర్మాణం సమీక్షించబడుతుంది.
- By Gopichand Published Date - 04:26 PM, Tue - 25 February 25

8th Pay Commission Impact: కొంతకాలం క్రితం భారత ప్రభుత్వం 8వ పే కమిషన్ను ప్రకటించింది. దాని కింద ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుపై చర్చ జరుగుతోంది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, అలవెన్సులను నిర్ణయించడంలో పే కమీషన్ (8th Pay Commission Impact) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒకసారి దీనిని వర్తింపజేస్తే కనీసం 10 సంవత్సరాల వరకు ఇది ప్రభావవంతంగా ఉంటుంది. దేశంలోని 140 కోట్ల జనాభాలో దాదాపు 1 కోటి మంది ప్రస్తుత లేదా కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు, వీరు 7వ వేతన సంఘం ప్రయోజనాన్ని పొందుతున్నారు.
8వ వేతన సంఘం కోసం సన్నాహాలు
7వ పే కమిషన్ను 2014లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. 2016లో ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘంపైనే ఉంది. దీనికి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) ఏప్రిల్ నాటికి ఖరారు కావచ్చని భావిస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) సిబ్బంది పక్షం ToR ప్రతిపాదనను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT)కి పంపింది.
Also Read: MS Dhoni: ఐపీఎల్ 2025కి ముందు ధోని కీలక నిర్ణయం.. ఏంటంటే?
8వ వేతన సంఘం సాధ్యమయ్యే పరిస్థితులు ఏమిటి?
ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లలో పెను మార్పులు రావచ్చు. దీని కింద ఉద్యోగులందరి జీతాల నిర్మాణం సమీక్షించబడుతుంది. ఆచరణీయం కాని పే స్కేల్ల విలీనం పరిగణించబడుతుంది. తద్వారా కెరీర్ వృద్ధిని మెరుగుపరచవచ్చు.
- కనీస వేతనం Aykroyd ఫార్ములా, 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.
- దీంతో ఆర్థిక భద్రత పెంచేందుకు వీలుగా మూలవేతనం, పెన్షన్లో డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను చేర్చాలని ప్రతిపాదించారు.
- దీని ప్రకారం.. పింఛను, గ్రాట్యుటీ, కుటుంబ పింఛన్లను సవరిస్తారు. జనవరి 1, 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేయబడింది.
- నగదు రహిత, అవాంతరాలు లేని ఆరోగ్య సేవలను అందించడానికి CGHS (కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం) మెరుగుపరచబడుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు పిల్లలకు విద్యా భత్యం, హాస్టల్ భత్యం పెంచాలని సూచించారు.
100% జీతం పెరుగుదల ప్రయోజనం పొందుతారా?
NC-JCM స్టాఫ్ సైడ్ లీడర్ M. రాఘవయ్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొత్త పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2 పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అంటే 100% జీతం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రకారం కనీస మూల వేతనం నెలకు రూ.18,000 కాగా, ప్రాథమిక పెన్షన్ రూ.9,000. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2ని వర్తింపజేస్తే.. కనీస మూల వేతనం రూ.36,000 కాగా కనీస పెన్షన్ రూ.18,000గా ఉండనుంది.