YS Sharmila: అసెంబ్లీ ఎన్నికల బరిలో YSRTP, కాంగ్రెస్ కు ఎదురుదెబ్బే!
షర్మిల తన నిర్ణయంతో ముందుకు వెళితే కాంగ్రెస్కు సవాల్ ఎదురవుతుంది.
- By Balu J Published Date - 02:41 PM, Tue - 10 October 23
YS Sharmila: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలని వైఎస్ షర్మిల భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి అభ్యర్థులు ఖరారయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే షర్మిల అధికారికంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనంపై ఊహాగానాలు చెలరేగడంతో ఈ నిర్ణయం రాజకీయ వర్గాలను షాక్కు గురి చేసింది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం చేయడంతో షర్మిల రంగంలోకి దిగబోతుంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలలుగన్న రాహుల్ గాంధీ ప్రధాని ప్రయత్నానికి మద్దతివ్వాలనే లక్ష్యంతో పార్టీ నాయకత్వం కాంగ్రెస్లో విలీనానికి మొగ్గు చూపిందని షర్మిల సన్నిహిత వర్గాలవారు అంటున్నారు. అయితే గత నెలలో సోనియా, రాహుల్ గాంధీలతో జరిపిన చర్చలు నిర్దిష్ట ఫలితాలు ఇవ్వకపోవడంతో షర్మిల అనిశ్చితిలో పడ్డారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని షర్మిల సెప్టెంబర్ 30 వరకు గడువు విధించినప్పటికీ, విలీన తేదీ గురించి ఎటువంటి సమాచారం లేదు. దీంతో విసుగు చెందిన షర్మిల మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
షర్మిల తన నిర్ణయంతో ముందుకు వెళితే కాంగ్రెస్కు సవాల్ ఎదురవుతుంది. తెలంగాణలో చాలా మందికి రాజశేఖర రెడ్డి వారసత్వంతో భావోద్వేగ అనుబంధం ఉంది; వైఎస్ఆర్టీపీ ఎన్నికల్లో పోటీ చేస్తే, అది వైఎస్ఆర్ అనుచరులను, సానుభూతిపరులను షర్మిల పార్టీ వైపు మళ్లించే అవకాశం ఉంది. అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ కు ఒకవిధంగా ఓటింగ్ పై దెబ్బ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎంతోకొంత ప్రభావం ఉంటుంది.
Related News
Congress vs YSRCP : శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ ఓట్లను కాంగ్రెస్ చీల్చిందా..!
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార పార్టీ గెలుపు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ త్రిముఖ పోటీలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు లాభపడగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పోటీ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.