Telangana: మహిళల రిజర్వేషన్ పై కవితమ్మ చిలక పలుకులు: షర్మిల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వాడివేడి మొదలైంది. పార్టీలు తమ అభ్యర్థుల వేటలో పడ్డాయి. తాజాగా బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్ధుల జాబితాని ప్రకటించింది.
- By Praveen Aluthuru Published Date - 05:30 PM, Wed - 23 August 23
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వాడివేడి మొదలైంది. పార్టీలు తమ అభ్యర్థుల వేటలో పడ్డాయి. తాజాగా బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్ధుల జాబితాని ప్రకటించింది. 115 స్థానాలకు గానూ సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల జబితాను విడుదల చేశారు. అయితే అందులో కేవలం 7 స్థానాల్లో మాత్రమే మహిళలు ఉన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన ఎమ్మెల్సీ కవితమ్మ ఎక్కడికి పాయె అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల. 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా అని సూటిగా ప్రశ్నించారు. ఆకాశం,అధికారం సగం సగం అని శ్రీరంగ నీతులు చెప్పిన మీరే 6 శాతం ఇస్తే చిత్తశుద్ధి చూపినట్లా కవితమ్మ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలి అంటూ పేర్కొన్నారు.
తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా క్యాబినెట్ లోనూ ప్రాధాన్యత దక్కలదని మండిపడ్డారు. లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి క్యాబినెట్ లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి అంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పైన స్పందించిన పాపాన పోలేదు.. రాజధాని నడిబొడ్డున ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నా, మీ పోలీసులు మహిళా రైతులకు బేడీలు వేసినా, స్టేషన్ లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినా మీకు పట్టదు.. మీ దృష్టిలో మహిళలు వ్రతాలు చేసుకోవడానికి, ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొస్తారు కానీ రాజకీయాలకు కాదు.. . నిజంగా మీకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం అమలు చేయించాలి. సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవితమ్మ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల.
Also Read: Vijay Deverakonda: ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: రౌడీ బాయ్ షాకింగ్స్ కామెంట్స్
Related News
BRS Party: కెసిఆర్ ఓటమిని గ్రామీణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు : అల్లిపూరం
BRS Party: కొడంగల్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపూరం వెంకటేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గంలో 25 రోజులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించామని, గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ను ఓడించినందుకు కెసిఆర్ ఓటమిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నానని, కొడంగల్ న