HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ys Sharmila Phone Call To Revanth Reddy And Bandi Sanjay Heated Telananga Politics

YS Sharmila: కేసీఆర్ కు షాక్.. రేవంత్, బండికి షర్మిల ఫోన్!

కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలనే ప్రాతిపాదనను వైఎస్సాఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల లేవనెత్తారు

  • By Balu J Published Date - 01:21 PM, Sat - 1 April 23
  • daily-hunt
T Politics
T Politics

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరుగబోతున్నాయి. కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలనే ప్రాతిపాదనను వైఎస్సాఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల లేవనెత్తారు. ఈ మేరకు షర్మిల బండి సంజయ్, రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు.  కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్ బ్రతకనివ్వరని తెలిపారు. షర్మిల ఫోన్‌కాల్‌పై బండి సంజయ్, రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై క‌లిసిపోరాడ‌దామ‌ని వాళ్లిద్ద‌రిని ష‌ర్మిల కోరారు. ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతామ‌ని పిలుపునిచ్చారు. అలాగే ప్ర‌గ‌తిభ‌వ‌న్ మార్చ్‌కు పిలుపునిద్దామ‌ని ఆ ఇద్ద‌రు నేత‌ల ఎదుట ప్ర‌తిపాదించారు. కేసీఆర్ మెడ‌లు వంచాలంటే ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏకం కావాల‌ని ష‌ర్మిల కోరారు. ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఐక్యంగా పోరాటం చేయ‌క‌పోతే ఎవ‌ర్నీ బ‌త‌క‌నివ్వ‌ర‌నే బండి సంజ‌య్‌, రేవంత్‌ల‌తో త‌న అభిప్రాయాన్ని ష‌ర్మిల కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు.

ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని బీజేపీ నేత స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి కూడా అన్నట్లు తెలుస్తోంది.  ఒకవేళ రేవంత్ రెడ్డి, బండి సంజయ్, వైఎస్ షర్మిల ఒకే వేదికమీదికి వస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరగడం ఖాయమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

టీఎస్పీఎస్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్ కేవలం ఇద్దరికి మాత్రమే ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పేపర్ లీకైనట్లుగా 2017 నుంచి వార్తలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిగ్గా విచారణ చేయడం లేదని షర్మిల అన్నారు. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు సేకరించడంలో విఫలమవుతోందని ఆరోపించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపైనా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • phone call
  • revanth reddy
  • telangana politcs
  • ys sharmila

Related News

Revanth Speech

Panchayat Polls: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల దుమారం: షెడ్యూల్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్

ఈ నెల 25న జరగబోయే కేబినెట్ మీటింగ్‌కు ముందే రిజర్వేషన్లపై పూర్తి జీవో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    RK Rule : తెలంగాణలో ఆర్కే పాలన అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..అసలు ఎవరు ఆర్కే..?

  • Rajamouli Varasani Comments

    Rajamouli Comments : రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ రీ యాక్షన్ ఎలా ఉందంటే !!

Latest News

  • Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!

  • Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!

  • Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?

  • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!

  • Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

Trending News

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd