HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ys Sharmila Fires On Kcr Over Podu Pattas Distribution

YS Sharmila: ఓట్ల పండగ రాగానే పోడు రైతులు యాదికొచ్చారా?

రాజకీయంగా నిత్యం అధికార పార్టీని ప్రశ్నించే వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీపై విమర్శలు గుప్పించారు.

  • By Praveen Aluthuru Published Date - 11:34 AM, Sat - 1 July 23
  • daily-hunt
Sharmila Kcr
Sharmila Kcr

YS Sharmila: రాజకీయంగా నిత్యం అధికార పార్టీని ప్రశ్నించే వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీపై విమర్శలు గుప్పించారు. నిన్న సీఎం కేసీఆర్ అసిఫాబాద్లో పర్యటించారు. గిరిజనులకు పోడు భూముల పత్రాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల నిన్న జరిగిన కార్యక్రమంపై విమర్శలు చేశారు.

ఇన్నాళ్లు పోడు రైతులను కొట్టి,హింసించి, జైలులో వేసిన దొర గారికి ఓట్ల పండగ దగ్గరకు రాగానే మళ్లీ పోడు రైతులు యాదికొచ్చారా అంటూ మండిపడ్డారు. తొమ్మిదేండ్లలో ఎనిమిది సార్లు పోడు పట్టాలు ఇస్తానని ప్రకటించి పోడు రైతుల్ని నిండా ముంచిన సీఎం ఇప్పుడు ఓట్ల సమయం కావడంతో గిరిజనులపై సవతి తల్లి ప్రేమ కురిపిస్తున్నాడని ఫైర్ అయ్యారు ఆమె. ఊరించి ఊరించి కొసరేసినట్టు కొంతమందికే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడని షర్మిల ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 12.50 లక్షల ఎకరాల్లో పోడు భూములు ఉన్నాయని స్వయంగా అధికారులే లెక్కలు బయటపెడితే.. ఆ కాగితాలను చింపేసి కాదు 4.05 లక్షల ఎకరాలే పోడు పట్టాలు అని సొంత లెక్కలు చెప్తున్నారని అధికార పార్టీని ఎండగట్టారు ఆమె. 25శాతం భూములకు మాత్రమే పోడు పట్టాలు ఇచ్చి, మిగిలిన రైతులకు ఎగనామం పెట్టడమే దొర గారి దురాలోచన అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు షర్మిల. పోడు రైతుల పట్ల కేసీఆర్ కు చిత్తశుద్ధే ఉంటే.. నాలుక మీద నరమే ఉంటే ఇచ్చిన హామీ ప్రకారం.. 12.50లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వాలి.

Read More: Modi- Amit shah: యాక్ష‌న్‌లోకి అమిత్ షా, న‌డ్డా.. ఆరోజే ఫుల్ క్లారిటీ వ‌చ్చేస్తోందా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asifabad
  • Distribution
  • kcr
  • Podu Pattalu
  • telangana politics
  • tribal
  • ys sharmila

Related News

    Latest News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

    • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

    Trending News

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

      • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd