Telangana: తెలంగాణలో దొర గారి భూదందాలు: షర్మిల
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ వైఎస్ షర్మిల మాటలు తూటాల్లా పేల్చుతున్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ఆర్టీపి పార్టీ నెలకొల్పి సీఎం కేసీఆర్ మరియు ఆ పార్టీని ఎండగడుతున్నారు.
- By Praveen Aluthuru Published Date - 05:31 PM, Thu - 17 August 23
Telangana: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ వైఎస్ షర్మిల మాటలు తూటాల్లా పేల్చుతున్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ఆర్టీపి పార్టీ నెలకొల్పి సీఎం కేసీఆర్ మరియు ఆ పార్టీని ఎండగడుతున్నారు. రోజుకో అంశంపై షర్మిల కేసీఆర్ ని దుయ్యబడుతున్నారు. నిన్నటికి నిన్న ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కోట్లు నొక్కేశాడని ఆరోపించారు. ఈ రోజు భూముల దందాపై ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. అడిగేటోడు లేడని సర్కారీ భూములపై దొర ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కావాల్సింది కాజేయడం, ఉన్నది అమ్మేయడమే కేసీఆర్ చేస్తున్నది అంటూ ఎద్దేవా చేశారు. భూదందాలకు పాల్పడుతూ.. తనకు నచ్చిన రేటుకే అమ్మకానికి పెట్టి ఆయనే కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించారు. కబ్జాలు చేస్తూ ప్రజలకు మాత్రం కాంపిటీషన్ పెడుతున్నడు అంటూ ఫైర్ అయ్యారు. జిల్లాల్లో పార్టీ ఆఫీసుల పేరిట రూ.వెయ్యి కోట్లు విలువ జేసే 33.72ఎకరాల భూములను రూ.3 కోట్లకే అప్పనంగా కొట్టేశారని విమర్శించారు షర్మిల. ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో దొర గారి భారతీయ భవన్ కోసం రూ.3.41 కోట్లకే 11ఎకరాలు దోచేశారని ఆరోపించారు. దాదాపు రూ.1100 కోట్లు విలువ చేసే భూమిని అప్పనంగా పార్టీ ఆఫీసుకు లాక్కున్నారు.
ప్రభుత్వ పనులకు పనికొచ్చే భూములన్నీ దొర గారి సొంత పార్టీ అవసరాలకు,ఆయన బినామిలకు ఉపయోగ పడుతున్నయని అన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా, జనం దుమ్మెత్తిపోసినా తుడుచుకొనిపోతున్నాడు కానీ దొర గారిలో మార్పు రావడం లేదని ఘాటైన వ్యాఖ్యలకు పాల్పడ్డారు షర్మిల. కేసీఆర్ .. నువ్వు రాయించుకున్న అత్యంత విలువైన కొకపేట భూములను వెంటనే ప్రభుత్వపరం చేయాలనీ డిమాండ్ చేశారు. లేదా ఎకరం రూ.100 కోట్ల లెక్కన రూ.11వందల కోట్లను మీ పార్టీ అకౌంట్ లో మూలుగుతున్న రూ.12వందల కోట్ల నుంచి కట్టాలని వైఎస్ షర్మిల సూచించారు.
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది