Telangana: తెలంగాణలో దారుణ ఘటన.. కూతురు కులాంతర వివాహం చేసుకుందని..!
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది.
- By Gopichand Published Date - 02:19 PM, Tue - 15 November 22
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. బాలపల్లికి చెందిన మధు, ఇటిక్యాలకు చెందిన అక్షిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో యుతతి తల్లిదండ్రులు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆమెను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తూ తీవ్రంగా కొట్టారు. కారులోనే ఆమెకు శిరోముండనం చేశారు.
జగిత్యాల రూరల్ మండలం బాలపల్లిలో ఓ యువతిని కిడ్నాప్ చేసిన బంధువులు ఆమెకు గుండు కొట్టించి అమానుషంగా ప్రవర్తించారు. జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. బాలపల్లికి చెందిన జక్కుల మధు (23), రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన అక్షర (20) ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరుకావడంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ప్రస్తుతం ఆమె అత్తగారి ఇంటి వద్ద ఉంటుంది. యువతిని ఎలాగైనా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రెండు కార్లలో బాలపల్లికి చేరుకున్నారు.
ఆ సమయంలో భర్త మధు ఇంటి వద్ద లేడు. యువతి కుటుంబీకులు గొడ్డలి, కత్తులతో మధు కుటుంబ సభ్యులపై దాడి చేసి అక్షరను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఈ ఘటనపై మధు జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్షర తండ్రి భూమయ్య, ఆమె మేనమామ సత్తయ్య మరికొందరిపై కేసు నమోదు చేశారు. కాగా అక్షరను కిడ్నాప్ చేసిన ఆమె బంధువులు గుండు కొట్టించి హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేయగా విషయం తెలుసుకున్న అక్షర భర్త మధు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు యువతి బంధువులను అదుపులోకి తీసుకొని అక్షరను భర్తతో వారింటికి పంపించేశారు.
Related News
Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్10-11 లోక్సభ స్థానాలు గెలిస్తే తెలంగాణలో మళ్లీ ఏడాదిలోపే బీఆర్ఎస్ అధినేత కేసీఆరే సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.