Harish Rao: కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు : మాజీ మంత్రి హరీశ్ రావు
- By Balu J Published Date - 01:41 PM, Fri - 12 January 24
Harish Rao: గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ZP చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కార్యకర్తలతో మాట్లాడారు.
‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి మొక్కవోని పోరాటం వల్లే వచ్చింది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆరే. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు, కేసీఆర్ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరు. తెలంగాణ వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చినయి, మన గ్రామలు అభివృద్ధి చెందినయి. తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్ వచ్చింది, రైతుబంధు, రైతు బీమా వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చింది, దివ్యాంగుల పెన్షన్ వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇవన్నీ తెచ్చింది మన కేసీఆర్’’ అని హరీశ్ రావు తెలిపారు.
‘‘ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పనిచేస్తాం. మనోహరాబాద్ను మండలం చేసింది కేసీఆర్. కాని ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట. కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటున్నది. కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా! కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై అబద్ధాలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేశారు. మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారు’’ ఆయన మండిపడ్డారు.
‘‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుందాం. నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా? కాంగ్రెస్కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్కు ప్రజలంటే బాధ్యత. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఓడినంత మాత్రన ప్రజలను వదిలేయం. వారి పక్షాన పోరాడతాం. బీఆర్ఎస్కు ప్రజలే దేవుళ్లు. బట్ట కాల్చి బీఆర్ఎస్ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరు. ఆరోపణలు మాని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతాం’’ అని హరీశ్ రావు తెలిపారు.
Tags
Related News
TS : ఇంకా రాష్ట్రంలో యుద్ధం మిగిలే ఉంది: మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Former CM KCR: రాజకీయ, సామజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు(Telangana activist) గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిత్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు(శుక్రవారం) ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ ప్రత్యే