Telangana Politics: కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీచేయడం కన్ఫర్మేనా ?
- By Siddartha Kallepelly Published Date - 04:15 PM, Wed - 9 February 22
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాయని రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటిదాకా ప్రతి విషయంలో విమర్శించుకున్న ఈ ఇరు పార్టీలు కాస్త సైలెంట్ అవ్వడానికి రెండు పార్టీల అగ్రనాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేంద్రంలో బీజేపీని కాంగ్రెస్ సింగిల్ గా ఎదుర్కొనే పరిస్థితి లేదు. కాబట్టి కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లాలనేది కాంగ్రెస్ ఆలోచన ఇప్పటికే టీఆర్ఎస్ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు సాధారణ ఎన్నికల్లో జాతీయ ప్రయోజనాలకు సంబందించిన చర్చ ఉంటుంది. రాష్ట్రంలో బీజేపీ మెల్లిమెల్లిగా ఏమర్జ్ అవుతోంది కాబట్టి సాధారణ ఎన్నికలకు వెళ్తే బీజేపీపుంజుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ఒంటరిగా వెళ్తే టీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ చెప్పారని, కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేస్తే బాగుంటుందని పీకే టీం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లీకులు తెలిపినట్టు ఎన్నికలకు ముందు అలయన్స్ లేకపోయినా పోస్ట్ అలయెన్స్ అయినా ఉండొచ్చని రెండు పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ ఈ మధ్య మాట్లాడుతున్న మాటల్లో బీజేపీని కూకటివెళ్లతో సహ పీకేయాల్సిన అవసరాన్ని, దేశం బాగుపడాలంటే బిజెపిని గద్దె దించాలని పలుమార్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా ఇదే. అయితే బిజెపిని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ కు లేదు కాబట్టి కారులో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నట్లు నిర్ణయించుకోవాలని డిసైడైనట్టు సమాచారం. దానిలో భాగంగానే ఇటీవల కాజీపేట రైల్వే కోచ్ విషయంలో రెండు పార్టీలు కలిసి బిజెపిని కార్నర్ చేయడం వారి అలయెన్స్ కు మొదటి స్టెప్ అనుకోవచ్చు. ఇటీవల పార్లమెంట్ లో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాను సరైన పద్దతిలో విభజించలేదని వాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కంటే కూడా టీఆర్ఎస్ రియాక్ట్ అయింది. తెలంగాణపై అక్కసు వెళ్లగక్కిన మోదీ దిష్టి బొమ్మలను రాష్ట్రవ్యాప్తంగా తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ రియాక్షన్ పై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ కాంగ్రెస్ ని తిడితే కేసీఆర్ కి ఏం నోప్పని విమర్శించారు. ఈ కామెంట్స్ ని బట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయెన్స్ పై కేంద్రానికి సమాచారముందని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణని ఇచ్చిన పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ ఉంది. కాంగ్రెస్ ని డీ ఫేమ్ చేయడానికే మోదీ ఆ విధంగా మాట్లాడారని, తద్వారా టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయెన్స్ కి ఆదిలోనే చెక్ పెట్టొచ్చని మోదీ భావించారని పరిశీలకులు భావిస్తున్నారు. మోదీ, సంజయ్ ల రియాక్షన్ బట్టి కాంగ్రెస్,టీఆర్ఎస్ కలిసి పోటీచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ అదే జరిగితే రాజకీయాల్లో అది భారీ కుదుపుకే దారి తీస్తుందనేది కాదనలేని సత్యం.
Related News
School Fee : స్కూల్ ఫీజుల నియంత్రణపై దృష్టి సారించిన రేవంత్ సర్కార్
పాఠశాల ఫీజుల నియంత్రణకు క్రమబద్ధమైన విధానాన్ని తీసుకురావడం , అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడటం లక్ష్యంగా పాఠశాల ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.