HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Will Justice Be Served Only If The Government Changes Rajagopals Key Comments

Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

Congress : గతంలో మంత్రి పదవిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ విషయంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త సవాళ్లను విసిరేలా కనిపిస్తున్నాయి.

  • Author : Sudheer Date : 07-09-2025 - 8:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Secret meeting with Congress MLAs is false: Rajagopal Reddy
Secret meeting with Congress MLAs is false: Rajagopal Reddy

రీజనల్ రింగ్ రోడ్ (RRR) అలైన్‌మెంట్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ డివిజన్‌లోని (ఉత్తర భాగం) రైతులు భూములు కోల్పోతున్నారని, ఈ విషయంలో వారు అధికారులను, ఢిల్లీలోని పెద్దలను కలిసినా న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం దివీస్ సంస్థ కోసం రూట్ అలైన్‌మెంట్ మార్చిందని, అదే విధంగా ఇప్పుడు దక్షిణ భాగం అలైన్‌మెంట్ మారాలంటే మొదట ఉత్తర భాగం అలైన్‌మెంట్ మారాలని, అది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వమే మారాలేమో అని రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని సృష్టించాయి.

Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఆదివారం భూ నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు జరిగిన అన్యాయాన్ని తాను తట్టుకున్నానని, కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం మౌనంగా ఉండలేనని అన్నారు. అవసరమైతే ట్రిపుల్ ఆర్ (RRR) రద్దయినా సరే, ఉత్తర భాగం భూ నిర్వాసితుల హక్కులను కాపాడుతానని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. తన నియోజకవర్గ ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా, ఏ త్యాగానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ప్రజలకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడటానికి వెనుకాడనని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తనకు పదవుల కన్నా తన ప్రాంత ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చెబుతానని అన్నారు. ట్రిపుల్ ఆర్ పనుల వల్ల మునుగోడు నియోజకవర్గ ప్రజలే ఎక్కువగా భూములు కోల్పోతున్నారని, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, అవసరమైతే కేంద్ర మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. గతంలో మంత్రి పదవిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ విషయంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త సవాళ్లను విసిరేలా కనిపిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress govt change
  • congress party
  • Komatireddy Raj Gopal Reddy
  • komatireddy raj gopal reddy key comments
  • telangana

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd