E-Racing: ఈ-రేసింగ్ ట్రాక్ మీదకు వాహనాలు.. ఒక్కసారిగా షాక్!
అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ-రేసింగ్ కు భాగ్యనగరం వేదికగా మారింది. గతంలో కూడా హైదరాబాద్ వేదికగా ఈ-రేసింగ్ జరగగా..
- By Nakshatra Published Date - 08:15 PM, Fri - 10 February 23
E-Racing: అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ-రేసింగ్ కు భాగ్యనగరం వేదికగా మారింది. గతంలో కూడా హైదరాబాద్ వేదికగా ఈ-రేసింగ్ జరగగా.. తాజాగా మరోసారి హైదరాబాద్ రోడ్ల మీద రేస్ కార్లు జర్రుమంటూ దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుకోని ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనను గతంలో ఎప్పుడూ చూడని ఈ-రేసింగ్ నిర్వాహకులు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు.
హైదరాబాద్ లో జరుగుతున్న ఈ-రేసింగ్ ట్రాక్ మీద ఒక్కసారిగా ప్రైవేట్ వాహనాలు చొచ్చుకువచ్చాయి. దీంతో ఈ-రేసింగ్ నిర్వాహకులు షాక్ అయ్యారు. కార్ రేసింగ్ కోసం అని సిద్ధం చేసిన ట్రాక్ మీదకు ప్రైవేట్ వాహనాలు దూసుకురావడంతో.. ఒక్కసారిగా విచిత్ర పరిస్థితి నెలకొంది. కార్ల రేసింగ్ కోసం అని సిద్ధం చేసిన రోడ్ల మీదకు సాధారణ వాహనాలు రాడంతో నిర్వాహకులు కాసేపు ఖంగారుపడ్డారు.
ఈ-రేసింగ్ ట్రాక్ మీదకు వచ్చిన ప్రైవేట్ వాహనాల వల్ల రేస్ ను నిర్వాహకులు ఆసల్యంగా ప్రారంభించారు. అయితే తెలుగుతల్లి ఫ్లైఓవర్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. గంటల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాహనదారులు ఒక్కసారిగా కోపం ఆపుకోలేక ఈ-రేసింగ్ కు సిద్ధం చేసిన రోడ్డు మీదకు వచ్చేశారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోపక్క ఈ-ఫార్ములా రేసుతో హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ కష్టాల వల్ల ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
రేస్ కారణంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్, లక్డీకాపూల్, అసెంబ్లీ, ఖైరతాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు ఉండటంతో.. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల వల్ల ఇప్పటికే ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్న తమకు.. రేస్ వల్ల మరింత ఇబ్బంది కలుగతోందని హైదరాబాద్ వాహనదారులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో రేస్ అవసరమా అని వాహనదారులు మండిపడుతున్నారు.
Related News
Allu Arjun Pushpa 2 : ఆ సినిమా కోసం మలేషియాని హైదరాబాద్ కి తెచ్చేశారు..!
Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా పార్ట్ 1 కన్నా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.