HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Use Of Drones In Tiger Conservation Efforts In Nallamala Forests

Nallamala Forest : నల్లమల అడవుల్లో పులులకు రక్షణ చర్యల్లో డ్రోన్ల వినియోగం

పులుల రక్షణకు మరింత ఆధునిక టెక్నాలజీ వినియోగానికి అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా డ్రోన్లు నల్లమల అడవుల్లో వినియోగంలోకి తీసుకువచ్చారు. పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు.

  • Author : Latha Suma Date : 09-07-2025 - 5:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Use of drones in tiger conservation efforts in Nallamala forests
Use of drones in tiger conservation efforts in Nallamala forests

Nallamala : నల్లమల అడవులు, దక్షిణ భారతదేశంలోని విలువైన బయో డైవర్సిటీ ప్రాంతంగా పరిగణించబడుతున్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 3,040.74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. పులుల సంరక్షణకు ఇది ముఖ్య కేంద్రంగా మారింది. గతేడాది జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (NTCA) నిర్వహించిన గణన ప్రకారం, నల్లమల ప్రాంతంలో మొత్తం 87 పులులు ఉన్నట్లు గుర్తించబడింది. అయితే, ఈ ఏడాది నిర్వహించిన సాధారణ గణనలో పులుల సంఖ్య 90కి పెరిగిందని అటవీ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇది పులుల అభివృద్ధికి, సంరక్షణ చర్యల విజయానికి నిదర్శనంగా నిలిచింది.

Read Also: Financial Secrets : ఈ ఆర్థిక రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి

ఈ నేపథ్యంలో, పులుల రక్షణకు మరింత ఆధునిక టెక్నాలజీ వినియోగానికి అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా డ్రోన్లు నల్లమల అడవుల్లో వినియోగంలోకి తీసుకువచ్చారు. పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు. మే 28వ తేదీన నాగలూటి రేంజ్ పరిధిలోని కెమెరా ట్రాప్ ద్వారా 132 నంబరు ఆడ పులి గుర్తించబడింది. ఈ పులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కి తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన అనంతరం, అటవీ శాఖ అధికారులు రుద్రకోడూరు బీట్ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. చివరకు జూలై 6న పులిని పట్టుకుని వైద్యం అందించారు. ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో చికిత్స పొందుతున్న ఈ పులిని పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి నల్లమల అడవిలోకి వదిలే అవకాశముందని సమాచారం. ఇంకా, మే నెలలో శ్రీశైలం రేంజ్ పరిధిలో ఓ పెద్ద పులి జనావాసాల ప్రాంతాల్లో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. దీనిని టి-82గా గుర్తించి, అది అనారోగ్యంతో బాధపడుతుందని తేల్చారు. ఈ పులి ఆచూకీ కోసం ప్రస్తుతం డ్రోన్ల సహాయంతో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.

అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం మూడు అధునాతన డ్రోన్లను నల్లమలలో ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్లు 5-6 కిలోమీటర్ల పరిధిలో జంతువుల కదలికలను గుర్తించగలవు. పులుల ఆచూకీ తెలిసిన వెంటనే, రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని మత్తు మందులు ఇచ్చి చికిత్స అందిస్తుంది. డ్రోన్ల వినియోగం వల్ల ఎటువంటి మానవ జోక్యం లేకుండా వేగంగా స్పందించగలగటం అనేది ప్రధాన ప్రయోజనం. పులులు సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరా ట్రాప్‌లు రహదారుల ఇరువైపులా చెట్లకు 40 సెం.మీ.ల ఎత్తులో అమర్చుతున్నారు. ఈ కెమెరాలు 15 సెకన్ల వ్యవధిలో మళ్లీ రీ-సెట్‌ అవుతూ, సంచారంలో ఉన్న జంతువుల ఫొటోలు తీయగలవు. ఇది సంరక్షణ చర్యలకు సహాయపడుతోంది. నల్లమల అడవుల్లో పులుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న పులులను గుర్తించి చికిత్స చేయడం, వేటగాళ్ల ఉచ్చులను తొలగించడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇలాంటివి పులుల భవిష్యత్‌ ప్రణాళికకు నాంది పడుతున్నాయని, త్వరలో మరిన్ని పులులు ఈ అడవుల్లో సంచరించే రోజులు త్వరలోనే వస్తాయని అధికారులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Hyderabad : కల్తీ కల్లు తాగి 11 మందికి అస్వస్థత

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Drones
  • Nallamala Forest
  • Nallamala Tiger Conservation
  • telangana
  • tigers

Related News

Revanth Govt Movie Tickets

సినిమా టికెట్ ధరల విషయంలో పదే పదే మాట మారుస్తూ విమర్శలు ఎదురుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం

టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం పదే పదే మాట మారుస్తుండటం వల్ల సామాన్య ప్రేక్షకుడిపై భారం పడుతోందనే వాదన వినిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలను ఆదుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, అది పారదర్శకమైన విధానాల ద్వారా జరగాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • Apsrtc Samme

    వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • Ntr Statue Amaravati

    అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం

  • Sankranthi Toll Gate

    సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులకు బ్యాడ్ న్యూస్ !

Latest News

  • తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్‌ ధరల పెంపు

  • శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!

  • గ్రీన్‌లాండ్‌ విషయంలో తగ్గేదిలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

  • ‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట

  • గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd