HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Use Of Drones In Tiger Conservation Efforts In Nallamala Forests

Nallamala Forest : నల్లమల అడవుల్లో పులులకు రక్షణ చర్యల్లో డ్రోన్ల వినియోగం

పులుల రక్షణకు మరింత ఆధునిక టెక్నాలజీ వినియోగానికి అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా డ్రోన్లు నల్లమల అడవుల్లో వినియోగంలోకి తీసుకువచ్చారు. పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు.

  • Author : Latha Suma Date : 09-07-2025 - 5:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Use of drones in tiger conservation efforts in Nallamala forests
Use of drones in tiger conservation efforts in Nallamala forests

Nallamala : నల్లమల అడవులు, దక్షిణ భారతదేశంలోని విలువైన బయో డైవర్సిటీ ప్రాంతంగా పరిగణించబడుతున్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 3,040.74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. పులుల సంరక్షణకు ఇది ముఖ్య కేంద్రంగా మారింది. గతేడాది జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (NTCA) నిర్వహించిన గణన ప్రకారం, నల్లమల ప్రాంతంలో మొత్తం 87 పులులు ఉన్నట్లు గుర్తించబడింది. అయితే, ఈ ఏడాది నిర్వహించిన సాధారణ గణనలో పులుల సంఖ్య 90కి పెరిగిందని అటవీ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇది పులుల అభివృద్ధికి, సంరక్షణ చర్యల విజయానికి నిదర్శనంగా నిలిచింది.

Read Also: Financial Secrets : ఈ ఆర్థిక రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి

ఈ నేపథ్యంలో, పులుల రక్షణకు మరింత ఆధునిక టెక్నాలజీ వినియోగానికి అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా డ్రోన్లు నల్లమల అడవుల్లో వినియోగంలోకి తీసుకువచ్చారు. పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు. మే 28వ తేదీన నాగలూటి రేంజ్ పరిధిలోని కెమెరా ట్రాప్ ద్వారా 132 నంబరు ఆడ పులి గుర్తించబడింది. ఈ పులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కి తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన అనంతరం, అటవీ శాఖ అధికారులు రుద్రకోడూరు బీట్ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. చివరకు జూలై 6న పులిని పట్టుకుని వైద్యం అందించారు. ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో చికిత్స పొందుతున్న ఈ పులిని పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి నల్లమల అడవిలోకి వదిలే అవకాశముందని సమాచారం. ఇంకా, మే నెలలో శ్రీశైలం రేంజ్ పరిధిలో ఓ పెద్ద పులి జనావాసాల ప్రాంతాల్లో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. దీనిని టి-82గా గుర్తించి, అది అనారోగ్యంతో బాధపడుతుందని తేల్చారు. ఈ పులి ఆచూకీ కోసం ప్రస్తుతం డ్రోన్ల సహాయంతో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.

అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం మూడు అధునాతన డ్రోన్లను నల్లమలలో ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్లు 5-6 కిలోమీటర్ల పరిధిలో జంతువుల కదలికలను గుర్తించగలవు. పులుల ఆచూకీ తెలిసిన వెంటనే, రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని మత్తు మందులు ఇచ్చి చికిత్స అందిస్తుంది. డ్రోన్ల వినియోగం వల్ల ఎటువంటి మానవ జోక్యం లేకుండా వేగంగా స్పందించగలగటం అనేది ప్రధాన ప్రయోజనం. పులులు సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరా ట్రాప్‌లు రహదారుల ఇరువైపులా చెట్లకు 40 సెం.మీ.ల ఎత్తులో అమర్చుతున్నారు. ఈ కెమెరాలు 15 సెకన్ల వ్యవధిలో మళ్లీ రీ-సెట్‌ అవుతూ, సంచారంలో ఉన్న జంతువుల ఫొటోలు తీయగలవు. ఇది సంరక్షణ చర్యలకు సహాయపడుతోంది. నల్లమల అడవుల్లో పులుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న పులులను గుర్తించి చికిత్స చేయడం, వేటగాళ్ల ఉచ్చులను తొలగించడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇలాంటివి పులుల భవిష్యత్‌ ప్రణాళికకు నాంది పడుతున్నాయని, త్వరలో మరిన్ని పులులు ఈ అడవుల్లో సంచరించే రోజులు త్వరలోనే వస్తాయని అధికారులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Hyderabad : కల్తీ కల్లు తాగి 11 మందికి అస్వస్థత

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Drones
  • Nallamala Forest
  • Nallamala Tiger Conservation
  • telangana
  • tigers

Related News

Tgpsc Group 3 Results

గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.మొత్తం 1,388 పోస్టులకు గాను ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • Big announcement at 12 noon..Nara Lokesh's interesting post

    మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

Latest News

  • రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం! అసలు VB-G RAM G బిల్లు అంటే ఏంటి ?

  • ముచ్చటగా మూడోసారి మలైకా డేటింగ్, ఈసారి ఏకంగా తన కంటే 17 ఏళ్ల చిన్నోడితో ?

  • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd