KTR Help:అనాథలైన పదేళ్ల చిన్నారులను ఆదుకోవాలన్న కేటీఆర్
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సింగారం గ్రామంలో, ఎస్సీ కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్, తిరుపతమ్మ దంపతులు ఒకేసారి చనిపోయారు.
- By Hashtag U Published Date - 11:37 PM, Mon - 22 November 21
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సింగారం గ్రామంలో, ఎస్సీ కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్, తిరుపతమ్మ దంపతులు ఒకేసారి చనిపోయారు. ఉతికిన బట్టలను కరెంట్ వైర్ పై ఆరేస్తుండగా తిరుపతమ్మకు కరెంట్ షాక్ తగిలింది. ఆమెను కాపాడడానికి తన భర్త ఉపేందర్ వెళ్లగా అయన కూడా కరెంట్ షాక్ తగిలింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
చనిపోయిన దంపతులకు శ్యామల,బిందు అనే ఇద్దరమ్మాయిలు ఉన్నారు.
కరెంట్ షాక్ తో చనిపోయిన తమ తల్లితండ్రుల అంత్యక్రియలను ఆ చిన్నారులే నిర్వహించారు. పదిసంవత్సరాలు కూడా లేని ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల చితికి నిప్పు పెట్టిన తర్వాత తాము అనాధలమయ్యామని బోరున విలపించారు.
https://twitter.com/KTRTRS/status/1462648187441668096
ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఆ చిన్నారులను ఆదుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి కేటీఆర్ కోరారు. పిల్లల బాధ్యతను చూసుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో పాటు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Related News
KTR: రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీ నేతలకు కేటీఆర్ ముఖ్య సూచనలు
KTR: బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలలో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచ