TRS: ఏడేండ్ల తర్వాత మళ్ళీ ఉద్యమబాట పట్టిన టీఆర్ఎస
వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మెడలు వంచుతామని, ధర్నాలు, నిరసనలు చేసి కేంద్రాన్ని కట్టడి చేస్తామని ప్రకటించిన కేసీఆర్ కి ఆదిలోనే ఆటంకం ఎదురైంది.
- By Hashtag U Published Date - 12:50 AM, Thu - 11 November 21
వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మెడలు వంచుతామని, ధర్నాలు, నిరసనలు చేసి కేంద్రాన్ని కట్టడి చేస్తామని ప్రకటించిన కేసీఆర్ కి ఆదిలోనే ఆటంకం ఎదురైంది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో హైదరాబాద్ మినహా తెలంగాణ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దింతో జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేయడానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా రైతు దీక్షల విషయంలో వెనక్కి తగ్గొద్దని టీఆర్ఎస్ భావిస్తోంది.
వరి ధాన్యాన్ని కేంద్రం కొననని తేల్చి చెప్పిందని, కానీ లోకల్ బీజేపీ నాయకులు ee విషయంపై రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. పంజాబ్ లాగే తెలంగాణాలో కూడా ఇక్కడ పండించే వరిని కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అయితే తాజాగా వచ్చిన ఎన్నికల కోడ్ వల్ల తమ ప్రీ డిక్లర్డ్ ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ కావొద్దని అధికారపార్టీ భావిస్తోంది. జిల్లాల కలెక్టర్ల అనుమతి తీసుకుని ధర్నాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు గైడ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
వరి కొనుగోలుపై రెండు పార్టీలు రెండు విరుద్ధమైన వాదనలు చేస్తున్నాయి. కానీ ఈగోల వల్ల నష్టపోయేది రైతులే కాబట్టి రాజకీయాలకోసం ఆలోచించకుండా కేంద్రం వెంటనే ఈ విషయంపై ఒక స్పష్టమైన వైఖరి తెలపాల్సిన అవసరం ఉంది.
Related News
CM Revanth: రైతుల ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్
CM Revanth: రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్లు రద్దు చేయాలని, కస్టమ్ �