HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Ministers Mps Leave For Delhi On Paddy Issue

TRS Leaders: తెలంగాణ మంత్రులంతా ఇక ఢిల్లీలోనే

తెలంగాణ రైతుల వరిధాన్యం సమస్య మళ్ళీ ఢిల్లీకి చేరింది. కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు డిల్లీకి చేరారు.

  • Author : Hashtag U Date : 19-12-2021 - 12:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TRS leader
TRS leader

తెలంగాణ రైతుల వరిధాన్యం సమస్య మళ్ళీ ఢిల్లీకి చేరింది. కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు డిల్లీకి చేరారు. ఈ టూర్ లో పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని అపాయింట్మెంట్ కోసం టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.

కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మండిపడుతోంది. ఏడేళ్లలో తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నిస్తోంది. ఈ విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటన దోహదపడుతుందని అధికార టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

కేంద్రం ఇచ్చిన 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తయిందని, మిగిలిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కోరేందుకు ఢిల్లీకి వచ్చామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకాలం పంటనంతా కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారన్నారు.
గత నెల క్రితమే సీఎం కేసిఆర్‌తో పాటు మంత్రులు ఎంపీలు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి మంత్రులను కలిసి చర్చించారు. అయినా కేంద్రం తాను ముందు చెప్పినట్టుగానే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రులు సైతం ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై రాతపూర్వకంగా ఒప్పందం ఇచ్చి ఇప్పుడు రాజకీయం చేస్తున్నారంటూ కేంద్రమంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఇక కేంద్రం చెప్పినట్టు రాష్ట్రంలోకూడా వేసవి వరి ధాన్యం పండించవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా చెప్పారు.

అయితే ఢిల్లీ వెళ్లి ధాన్యం విషయంలో ఎదో ఒకటి తేల్చుకునే రావాలని కేసీఆర్ సీరియస్ గా చెప్పడంతో ఈసారి పర్యటన, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

TRS leaders at Airport

TRS leaders at Airport


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Food Corporation of India (FCI).
  • kharif rice
  • mps
  • paddy issue
  • TRS Ministers

Related News

    Latest News

    • Mahesh in Varanasi : వారణాసిలో 5 గెటప్లలో మహేశ్ బాబు!

    • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

    • Peddi Shooting Update : క్లైమాక్స్ కు చేరుకున్న ‘పెద్ది’ షూటింగ్

    • Akhanda 2 Talk: ‘అఖండ-2’ – బాలయ్య విలయతాండవం

    • Bus Accident : అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం..15 మంది మృతి

    Trending News

      • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

      • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

      • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

      • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

      • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd