HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Minister Harish Rao Hard Comments On Piyush Goyal

Press Meet: “మీకేం పనిలేదా” అని అవమానిస్తారా?

తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తే.. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఉన్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున.. 70 లక్షల మంది రైతు కుటుంబాల తరఫున ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు. అలాంటివారిని "మీకేం పనిలేదా" అని అవమానిస్తారా?

  • Author : Balu J Date : 22-12-2021 - 1:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తే.. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఉన్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున.. 70 లక్షల మంది రైతు కుటుంబాల తరఫున ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు. అలాంటివారిని “మీకేం పనిలేదా” అని అవమానిస్తారా? ఇది తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని హరీశ్ రావు అన్నారు. 

‘‘పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తక్షణం ఉపసంహరించు కావాలి.. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా రాజకీయ నాయకుడిగా మాత్రమే వ్యవహరించారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఆరుగురు మంత్రుల కంటే ఇంకా పెద్ద డెలిగేషన్ ఉంటుందా? రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని  కలువకుండా ముందు మీ బీజేపీ నేతలను పిలిపించుకుని మాట్లాడతావా? అని’’ ప్రశ్నించారు.

ధాన్యం కొంటారా కొనరా.. చెప్పండి అని మంత్రుల బృందం వస్తె.. కలవడానికి సమయం లేదు అంటారా. వానాకాలంలో మీరు ఇచ్చిన 40 LMT టార్గెట్ పూర్తయింది. ఇప్పటికే యాభై లక్షల మెట్రిక్ టన్నుల కొన్నాం. మరో ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేలా ఉంది. రైతులు చలిలో కల్లాల దగ్గర ఉంటున్నారు.  వీటిని కొంటారా కొనరా అని అడగడానికి మంత్రులు వస్తే అవమానిస్తారా. యాసంగి లో బాయిల్డ్ రైస్ కొనమని చెప్పారు.. భవిష్యత్తులో రా రైస్ కూడా కొనం అంటే ఏం చేయాలి? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

టీఆరెఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఏది ముఖ్యం కాదు. అందుకే డిల్లీ వచ్చాం. మాట తప్పింది మీరు.. మాట మార్చింది మీరు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో నాడు కాకినాడ తీర్మానం చేసి వెనక్కి తగ్గింది బీజేపీ కాదా? ఒక్క ఓటు రెండు రాష్ట్రాల సిద్ధాంతం మీది అంటూ హరీశ్ రావు ఫైర్ అయ్యారు. విద్యుత్, సాగునీరు రాష్ట్రాల బాధ్యత. మా పని మేము వంద శాతం చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనవిధంగా ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం. గోదాములు కట్టాం, మార్కెట్లు అభివృద్ధి చేశాం. రైతులకు ఎరువులు విత్తనాలను సకాలంలో అందేలా చేస్తున్నామని పేర్కొన్నారు.

పోయిన వాన కాలం యాసంగి బియ్యమే ఇంకా ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. వ్యాగన్లు, గోదాములు ఇవ్వడం లేదని రాష్ట్ర మంత్రులు చెప్తే.. “మీరు ఒక్క లేఖ అయినా రాశారా” అని కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ఒకటి కాదు పది లేఖలు రాశాం. మేము బియ్యం ఇస్తాం మహాప్రభో తీసుకో.. హమాలీలు, టెక్నికల్ పర్సన్ ల సంఖ్యను పెంచుకో, గోదాములు లీజుకు తీసుకో అని చెప్తే పట్టించుకోలేదు. పైగా డొంకతిరుగుడు ఆరోపణలు చేస్తున్నారు. చెత్త చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అగ్రహం వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central government
  • harish rao
  • piyush
  • press meet

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Central Government Lifts Em

    Gas supply : గ్యాస్ సరఫరా పై అత్యవసర ఆంక్షలను ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd