HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Trs Calls 5000 Party Leaders For April 11 Protest In Delhi

TRS Calls: కేంద్రంతో యుద్ధానికి కేసీఆర్ సిద్ధం!

వరిధాన్యం కొనుగోళ్ల విషయమై ఇటు రాష్ట ప్రభుత్వం, అటు కేంద్రం ప్రభుత్వం నువ్వానేనా అన్నట్టు మాటల యుద్ధానికి దిగుతున్నాయి.

  • Author : Balu J Date : 08-04-2022 - 5:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

వరిధాన్యం కొనుగోళ్ల విషయమై ఇటు రాష్ట ప్రభుత్వం, అటు కేంద్రం ప్రభుత్వం నువ్వానేనా అన్నట్టు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ప్రత్యక్ష ఆందోళనకు సైతం తెరలేపాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రబీ సీజన్‌ వరిధాన్యాన్ని కేంద్రం సేకరించాలని డిమాండ్‌ చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం దాదాపు 5,000 మంది పార్టీ నేతలను సమాయత్తం చేస్తోంది. మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏప్రిల్ 10లోగా ఢిల్లీకి చేరుకుని ఏప్రిల్ 11న జరిగే ర్యాలీలో పాల్గొనాలని ఆదేశించింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో నిర్వహించనున్న తొలి ర్యాలీలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం నుంచి ఢిల్లీలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కార్యక్రమం జరిగే వేదిక, సమయాన్ని పార్టీ ఇంకా ప్రకటించలేదు. మంగళవారం పంటి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న చంద్రశేఖర్‌రావు నిరసనలో పాల్గొనడంపై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ భవన్‌ నుంచి ర్యాలీ ప్రారంభించి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వరకు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం జంతర్ మంతర్ వద్ద కొన్ని గంటల పాటు టీఆర్‌ఎస్ నేతలు ధర్నాకు దిగనున్నారు. ఈ ర్యాలీకి బీజేపీయేతర పార్టీల నేతలను ఆహ్వానిస్తారా లేదా అన్నదానిపై ఎలాంటి సమాచారం అందలేదు. భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన రాకేష్ టికైత్, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు, ఇతర రైతు సంఘాల నాయకులు పాల్గొంటారా అనేది స్పష్టత రావాల్సి వచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt
  • CK KCR
  • delhi
  • paddy issue

Related News

Central Govt Good News2

Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

  • Central Govt Good News

    Central Govt : దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్..ఇది చాలు !!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd